
యుద్ధరంగం వేగంగా మారిపోతోంది. తుపాకులు, ట్యాంకుల స్థానాన్ని ఇప్పుడు నిశ్శబ్దంగా ఆకాశంలో తిరిగే ఆధునిక డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి.
రాబోయే కాలంలో జరగబోయే అత్యాధునిక వైమానిక, డిజిటల్ యుద్ధాలకు అనుగుణంగా భారత సైన్యం తనను తాను శరవేగంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా, సరిహద్దు నిఘా , డ్రోన్ పోరాటాల కోసమే ప్రత్యేకంగా బాజ్ బెటాలియన్లను (Baaz Battalions) రంగంలోకి దించాలని భారత ఆర్మీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల వెంబడి జరిగే చొరబాట్లను ఇట్టే పసిగట్టడం, శత్రువుల గుడారాలపై ఈగ వాలినా కనిపెట్టి నిమేషాల వ్యవధిలో ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేయడం ఈ ప్రత్యేక గరుడ సేనల ముఖ్య బాధ్యత. ఇది భారత సైనిక ముఖచిత్రాన్నే మార్చేయబోతోంది.పాత పద్ధతులకు స్వస్తి.. ప్రత్యేక విభాగాలుగా బాజ్ప్రస్తుతం మన పదాతిదళ (ఇన్‌ఫాంట్రీ) విభాగాల వద్ద పరిమిత పరిధి కలిగిన చిన్నపాటి డ్రోన్ బృందాలు మాత్రమే విధుల్లో ఉన్నాయి. అయితే, వీటికి పూర్తి భిన్నంగా సరికొత్త సాంకేతికతతో, కేవలం మానవరహిత వైమానిక దాడులు (UAV Strikes), గగనతల నిఘా కోసమే ఈ బాజ్ బెటాలియన్లు ప్రత్యేక అత్యంత శక్తివంతమైన బలగాలుగా ఆవిర్భవించాయి. ఇటీవల జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ ఆసియాలో చోటుచేసుకున్న భీకర అంతర్యుద్ధాలు ఆధునిక రక్షణ వ్యూహాలలో డ్రోన్ల ప్రాధాన్యతను ప్రపంచానికి కళ్లకు కట్టాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు నియంత్రణ సంస్థలను బలోపేతం చేయాల్సిన అత్యవసర స్థితిని గమనించిన భారత సైన్యం ఈ విప్లవాత్మక అడుగు వేసింది.సైన్యానికి సెంట్రల్ బ్రెయిన్.. చైనా, పాక్ సరిహద్దులపై డేగకన్నుఈ సరికొత్త బాజ్ బెటాలియన్లు భారత సైన్యంలో ఒక సెంట్రల్ బ్రెయిన్ లేదా కేంద్ర నియంత్రణ వ్యవస్థలా పనిచేస్తాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సైన్యం ఆధీనంలో ఉన్న డ్రోన్ల సమగ్ర పర్యవేక్షణ, వాటి నిరంతర సాంకేతిక నిర్వహణ, ఆపరేటర్లకు అత్యున్నత శిక్షణ, వైమానిక డేటా క్రోడీకరణ వంటి కీలక బాధ్యతలు ఈ బెటాలియన్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. భారత్ డ్రోన్ ఆర్మీ వచ్చేస్తోంది.. ఇవి ఎవ్వరి మాటా వినవు..!వాస్తవాధీన రేఖ (LAC) వద్ద చైనాతో తలెత్తిన సుదీర్ఘ సరిహద్దు వివాదాలు, పాకిస్తాన్ సరిహద్దుల్లో సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనుభవాల ఆధారంగా ఈ ప్రత్యేక వ్యవస్థను డిజైన్ చేశారు. సాధారణ డ్రోన్ శిబిరాలు కేవలం పరిమిత పరిధిలోనే శత్రు కదలికలను గమనించగలవు. కానీ, ఈ కొత్త బాజ్ బెటాలియన్లు శత్రు దేశాల సరిహద్దుల్లోకి, కొండ ప్రాంతాల్లోకి లోతుగా చొచ్చుకుపోయి గగనతల నిఘా ఉంచగలవు. అత్యంత సుదూర శ్రేణి నిఘా సామర్థ్యం గల ఎమ్‌క్యూ-9బీ (MQ-9B) వంటి ఆధునిక ప్రిడేటర్ డ్రోన్ల సమాచారాన్ని కూడా ఇవి క్షణాల్లో విశ్లేషించి కమాండర్లకు అందిస్తాయి. ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్.. మీసాలు పెంచితే యాక్షనే!సైన్యంలో సమగ్ర మార్పుల దశాబ్దం.. భవిష్యత్ యుద్ధాలకు సై!భారత సైన్యాన్ని మరింత సాంకేతిక దిశగా నడిపించేందుకు ప్రారంభించిన సమూల మార్పుల ప్రణాళికలో భాగంగా ఈ బాజ్ బెటాలియన్లను సిద్ధం చేస్తున్నారు. కేవలం డ్రోన్ విభాగాలు మాత్రమే కాకుండా సైన్యానికి సరికొత్త రూపునిచ్చేందుకు భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు, రుద్ర బ్రిగేడ్లు, శక్తిబాణ్ ఆర్టిలరీ రెజిమెంట్లు కూడా రక్షణ వ్యవస్థలో చేరబోతున్నాయి. ప్రత్యక్ష యుద్ధరంగంలో మన సైనికుల ప్రాణాలకు నేరుగా ఎటువంటి ముప్పు లేకుండా వైమానిక సాంకేతికతతో శత్రువుల వ్యూహాలను దెబ్బతీసేందుకు ఈ కొత్త సేనలు ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే, శత్రువుల నుంచి తరచుగా పొంచి ఉన్న డ్రోన్ల నిఘా దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దేశ సరిహద్దు గగనతలాన్ని మరింత సురక్షితంగా మార్చేలా భార్గవాస్త్ర వంటి సరికొత్త స్వదేశీ కౌంటర్-డ్రోన్ రక్షణ వ్యవస్థలను సైన్యం శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. టెక్నాలజీని ఆయుధంగా మలచుకుని భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు బాజ్ బెటాలియన్లు సరికొత్త మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.