
Jammu and Kashmir | రీల్స్ తెచ్చిన తంటా.. నదిలోకిస్కార్పియోతో వెళ్లి ఇరుక్కుపోయిన యువకులు.. వైరల్ వీడియో
Jammu and Kashmir | రీల్స్ తెచ్చిన తంటా.. నదిలోకి స్కార్పియోతో వెళ్లి ఇరుక్కుపోయిన యువకులు.. వైరల్ వీడియో

Jammu and Kashmir | రీల్స్ తెచ్చిన తంటా.. నదిలోకి స్కార్పియోతో వెళ్లి ఇరుక్కుపోయిన యువకులు.. వైరల్ వీడియో

Prakash Raj: యువత భయానికి.. మన మహాప్రభువు రీల్స్ చేసుకుంటున్నాడు

తెలుగులో బబుల్ గమ్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో నటించిన మానస చౌదరి.. రీసెంట్గా అమ్మతో కలిసి కాశీ వెళ్లింది. అక్కడి ఘాట్స్లో తిరిగింది. తన పుట్టినరోజుని కూడా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది. కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన కర్ణాటక శాస్త్రీయ సంగీత నేపథ్యంలో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ‘18 పేజెస్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా.. ఈ చిత్ర బృందం NSR ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ప్రముఖ సిరీస్ 'బందిష్ బ్యాండిట్స్' చూసినప్పుడు చాలా నచ్చింది. దాన్ని కేవలం రీమేక్ చేయకుండా, మన కర్ణాటక సంగీతంలోని లోతైన కల్చర్తో, మన తెలుగు మూలాల నుంచి పుట్టిన కథగా తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాం. సంగీతంతో రొమాన్స్ చేయగల అనుభవం, మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఉండటం వల్లే సూర్యప్రతాప్ను డైరెక్టర్గా ఎంచుకున్నాం. నా గత సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేర్’లో నటించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్లతో మళ్లీ పనిచేయడం కుటుంబంతో ఉన్నట్లే అనిపించింది. కథకు తగ్గ స్కోప్ ఉన్నందున ప్రైమ్ వీడియోతో చర్చించి భవిష్యత్తులో తప్పకుండా ‘సీజన్ 2’ కూడా తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నప్పుడు, డైరెక్టర్ ప్రతాప్ చెప్పే విధానం

భారత పేస్ బౌలర్ ఆకిబ్ నబీ ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా యార్క్షైర్తో మ్యాచ్ సందర్భంగా సర్రే జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. కాగా కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ వన్-2026లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో సర్రే- యార్క్షైర్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సర్రే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యార్క్షైర్ బ్యాటింగ్కు దిగింది. రంజీల్లో దుమ్ములేపాడు జమ్మూ కశ్మీర్కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ జట్టు తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. గత రెండు సీజన్లలో కలిపి వందకు పైగా వికెట్లు తీసి ఆకిబ్ నబీ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో భారత్-ఎ తరఫున ఇటీవలే అరంగేట్రం చేసిన ఆకిబ్.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వైదొలగగా.. అతడి స్థానంలో సెలక్టర్లు నబీని ఎంపిక చేశారు. అయితే, లంకతో రెండు టెస్టులు ఆడిన భారత తుదిజట్టులో మాత్రం నబీకి చోటు దక్కలేదు. కివీస్ టూర్ సన్నాహకాల్లో భాగంగా ఇక టీమిండియా తదుపరి టెస్టు సిరీస్లో న్యూజిలాండ్తో తలపడేందుకు అక్కడికి వెళ్లనుంది. కివీస్ టూర్లో బౌన్సీ పిచ్లపై నబీ సేవలను వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఆ సన్నాహకాల్లో భాగంగానే అతడు ఇంగ్లండ్ కౌంటీల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆకిబ్ నబీ సర్రే తరఫున యార్క్షైర్తో పాటు.. హోవ్ వేదికగా సస్సెక్స్తో.. సర్రే సొంతమైదానంలో గ్లామోర్గాన్ జట్టుతో జరిగే మ్యాచ్లలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే.. సర్రే తరఫున ఆకిబ్ నబీ తాజాగా అరంగేట్రం చేయగా.. భారత ఆటగాడు రాహుల్ చహర్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదే జట్టులో ఉన్న భారత ఆల్రౌండర్ మహిపాల్ లామ్రోర్

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

సంగీత దర్శకుడిగా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం ఇమ్మోర్టల్. కయాడు లోహర్ కథానాయికగా నటించిన ఈ వ్యాంపైర్ ఫాంటసీ హారర్ రొమాన్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. పక్కింటి అమ్మాయితో సాధారణంగా మొదలైన ఒక ప్రేమకథ చివరకు ఎలా మారింది అనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రాత్రిపూట గది తాళం రంధ్రం నుంచి ఒక భయంకరమైన బ్యాట్ ముఖం ఉన్న జంతువు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ కథ ఒక తీవ్రమైన సర్వైవల్ నైట్మేర్గా మారుతుంది. ఈ సినిమాకు మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ప్రతిష్టాత్మకంగా సంగీతాన్ని అందించారు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అలాగే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికేట్ను విజయవంతంగా పొందింది. ఈ హారర్ రొమాన్స్ డ్రామాను కేవలం ఒక్క భాషకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. ఫలితంగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. సినిమా థ్రిల్లింగ్ అంశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. విభిన్నమైన వ్యాంపైర్ ఫాంటసీ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాల్సి ఉంది. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు టికెట్లు అందుబాటులోకి వచ్చినందున బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులు ఈ విభిన్నమైన హారర్ థ్రిల్లర్

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

ఆగస్టు 26న నేపాల్లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి. అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్ను ఉంచారు. ఆ పైప్, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. "అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి" అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు

సాఫీగా సాగిపోతూ ముగింపుకు వచ్చింది అనుకున్న కార్తీక దీపం సీరియల్ లో ఇటీవలే మాలిని తన విలనిజం చూపించడం మొదలుపెట్టింది. మాలిని పాత్ర ఎంట్రీతో కార్తీక దీపం సీరియల్ అనేక మలుపులు తిరిగింది. దీంతో మాలిని పాత్ర చేసిన కన్నడ నటి తేజస్విని ప్రకాష్ ఫొటోలు వైరల్ గా మారాయి. అనేక కన్నడ సీరియల్స్ లో నటించిన తేజస్విని కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో ఒక్కసారిగా తన విలనిజం బయటపెట్టి వైరల్ అయింది
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జమ్మూకశ్మీర్ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికగా మారబోతోంది. సినీ నిర్మాణ రంగానికి, సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచిన కశ్మీర్ లోయలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 'అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (International Film Festival of Jammu and Kashmir) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఈ ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలనచిత్రోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కశ్మీర్తో వెండితెరకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పునర్నిర్మించడమేనని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూనే, గ్లోబల్ సినిమా మ్యాప్లో కశ్మీర్కు తగిన గుర్తింపు తీసుకురావడం, పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేయడం మరియు సృజనాత్మక సహకారానికి వేదికను కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం. ఈ చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక జ్యూరీ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ఈ జ్యూరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి ఎంపిక చేసిన 135 చిత్రాలను ప్రదర్శించనుండగా, అందులో 64 ఎంట్రీలు భారతదేశానికి చెందిన చిత్రాలు కావడం విశేషం. విజేతలకు ప్రోత్సాహకంగా నిర్మాతలు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. మొత్తం తొమ్మిది విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసి రూ. 96 లక్షల నగదు పురస్కారాలను అందించనున్నారు. ఉత్తమ చలనచిత్రానికి రూ. 25 లక్షలు, ఉత్తమ దర్శకుడికి మరియు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ. 15 లక్షలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్ సెలెక్ట్' కేటగిరీ విజేతకు రూ. 10 లక్షలు లభించనున్నాయి. ఇక ఉత్తమ నటీనటులకు తలా రూ. 8 లక్షలు చొప్పున, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్ డిజైనర్ మరియు ఎడిటర్లకు తలా రూ. 5 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు

నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ ఇంటి వీడియో ఇటీవల కాలంలో వైరల్గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటో తాజాగా ఇంటి ఓనర్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ భవనం తాలూకు వీడియో ఇటీవల నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేపాల్లోని నువాకోట్ జిల్లాలో ఈ భవనం ఉంది. చుట్టూ ఇళ్లన్నీ జలసమాధి అవుతున్నా ఆ భవనం మాత్రం నిలబడ్డ తీరు జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. వరద సమయంలో భవనంలోనే ఉన్న ఆయన ఆ భయానక అనుభవం గురించి పలు విషయాలు చెప్పారు. ‘వరద చుట్టుముట్టే సమయంలో భవనంలో నాతో నా కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. మొదట నేను బయట ఒక షాపు వద్ద ఉండగా వరద అలర్ట్ అందింది. వెంటనే నేను ఇంటికి వెళ్లాను. అందరం బయటకు వెళదామనుకున్నాము. కానీ అప్పటికే బయట నీటి ఉధృతి పెరిగింది. దీంతో, మేము నాలుగో అంతస్తుకు వెళ్లాము. అక్కడికి కూడా నీరు వచ్చేయడంతో చివరకు భవనంపైకి వెళ్లాము. ఆ సమయంలో నా ఆలోచన అంతా కుటుంబంపైనే ఉంది’ ‘ఆ సమయంలో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు. మాకేమైనా అయితే వాడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెరిగిపోయింది. అదృష్టవశాత్తూ కొంత సేపటికి వరద ఉధృతి తగ్గింది. మాకు ప్రాణాపాయం తప్పింది’ అని ఆయన చెప్పారు. దాదాపు గంట పాటు ఆ కుటుంబం భవనంపైనే ఉండిపోయింది. ఆ తరువాత స్థానికులు కొందరు వచ్చి వారిని రక్షించారు. తమ ఇల్లు అంతటి వరద ఉధృతిని తట్టుకోవడానికి కారణం ఇంటి నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలే అని ఆయన చెప్పారు. ‘అది దాదాపు 40 ఏళ్ల నాటి భవనం. అప్పట్లో సిమెంట్, ఇతర సామగ్రి నాణ్యత ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. ఇంటి నిర్మాణం విషయంలో చాలా ఆలోచించి అనేక జాగ్రత్తలు

ఎమ్మెల్యే పుట్టాపై కిడ్నాప్ కేసు బెంగళూరు బీజేపీ నేత అపహరణ రాజరాజేశ్వరినగర్ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది Putta Sudhakar Yadav: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్పై బెంగళూరులో సంచలన కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ రవిప్రకాష్ను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. నాలుగు విభిన్న వాహనాల్లో వచ్చిన దుండగులు ఆయనను అపహరించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై బాధితుడు రవిప్రకాష్ భార్య సబీనా వెంటనే స్పందించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ హైడ్రామా వెలుగులోకి వచ్చింది. Narendra Modi: బంగారం కొనకండి.. విదేశీ ప్రయాణాలకు బ్రేక్ వేయండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు: ఎమ్మెల్యేతో పాటు కుమారుడిపై కేసు నమోదు: ఈ కిడ్నాప్ వ్యవహారంపై డాక్టర్ రవిప్రకాష్ భార్య సబీనా బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన భర్త అపహరణ వెనుక మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్(Putta Sudhakar Yadav)తో పాటు ఆయన కుమారుడు పుట్టా రవికుమార్ ప్రమేయం ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాప్నకు గల ఆర్థిక లేదా రాజకీయ కోణాలపై పోలీసులు దృష్టి సారించి శోధిస్తున్నారు

Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’

జీవీ ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. తాజాగా డిఎన్సి థియేటర్స్ సర్క్యూట్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక బుకింగ్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూసిన సినీ ప్రియులు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో జీవీ ప్రకాష్, కయాదు లోహర్ల వర్షంలో సాగే రొమాంటిక్ దృశ్యాన్ని పోస్టర్ ద్వారా ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రకటించిన ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని థియేటర్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కథలో కథానాయకుడు తానుష్టపడిన యువతి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందో చూపిస్తారు. దీంతో సాధారణంగా ప్రారంభమయ్యే రొమాంటిక్ ప్రయాణం ఒక రాత్రిలోనే భయానక భ్రమగా మారుతుంది. ఇదిలా ఉండగా 4,000 సంవత్సరాల పూర్వంనాటి వింత కథతో పాటు గబ్బిలం రూపంలో ఉండే భయానక జీవి ఈ కథలో కీలకంగా మారనుంది. ఇటీవలే ధనుష్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫలితంగా సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాషలో విడుదలైన టీజర్ కూడా విశేషమైన స్పందనను దక్కించుకుంది. ఈ చిత్రానికి మరియప్పన్ చిన్న దర్శకత్వం వహించగా, సామ్ సిఎస్ సంగీతం అందించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషలలో కూడా ఒకేసారి విడుదల కానుంది. ప్రస్తుతం ప్రేక్షకులు సెప్టెంబర్ 4వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఏ విధమైన ఘనవిజయాన్ని సాధిస్తుందో

నటుడు ఆకాష్ పూరి, తన కుటుంబం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక కష్టాలను, ముఖ్యంగా తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ జీవితంలో ఎదురైన క్లిష్టమైన దశ గురుంచి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతూ, చిన్నతనంలో తాను, తన కుటుంబం అనుభవించిన వేదనను పంచుకున్నారు. ఆకాష్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా పరిశ్రమలోకి ప్రవేశించి దాదాపు 16, 17 సంవత్సరాలకు పైగానే అయ్యింది. తన తండ్రి సినిమా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని ఆకాష్ పేర్కొన్నారు. అయితే, ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని, ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కుక్కలకు ఆహారం పెట్టలేని స్థితికి కూడా చేరుకున్నారని ఆకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో పూరి తన స్నేహితులకు ఫోన్ చేసి, తన పెంపుడు కుక్కలను తీసుకెళ్లమని కోరాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ బహిరంగంగా చెప్పారని ఆకాష్ గుర్తు చేసుకున్నారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. ఆ క్లిష్ట సమయంలో సినిమా పరిశ్రమలో ఉన్నవారు కూడా పూరి జగన్నాథ్కు అండగా నిలబడలేదని, ఆయన ఒంటరిగా మిగిలిపోయారని ఆకాష్ తెలిపారు. తన తల్లి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని, తాము చిన్నపిల్లలం కాబట్టి ఈ కష్టాలు తెలియకూడదని భావించి, తనను (ఆకాష్ను) అలాగే తన చెల్లిని హాస్టల్లో చేర్పించినట్లు వివరించారు. ఆ సమయంలో ఆకాష్ మూడో తరగతిలో ఉండగా, అతని చెల్లి రెండో తరగతిలో ఉంది. హాస్టల్లో ఉన్నప్పుడు తమకు ఏమీ తెలియలేదని, తమ నాన్న పెద్ద డైరెక్టర్ అని, అంతా హ్యాపీగా ఉందని భావించామని ఆకాష్ చెప్పారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్

ఇటీవల ఇరుముడి, విశ్వనాధ్ అండ్ సన్స్ వంటి హిట్స్ లైంలైట్లో ఉన్నాడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar). ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ఇమ్మోర్టల్’ (సెప్టెంబర్ 4 విడుదల) ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఓపెన్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. తన మాజీ భార్య సైంధవి (Saindhavi)తో ఉన్న రిలేషన్షిప్ గురించి ఆయన మాట్లాడిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భార్యాభర్తలుగా బంధం తెగిపోయినా తమ మధ్య స్నేహం మాత్రం అలాగే ఉందని జీవీ ప్రకాష్ స్పష్టం చేశారు. చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ కావడంతో ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ చెరిగిపోదని, విడాకులు తీసుకున్నంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. వివాహబంధం ముగిసినా ఒక మంచి రిలేషన్ను మెంటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటున్నామని తెలిపాడు జీవీ. కూతురు అన్వి పెంపకం విషయంలోనూ ఇద్దరం కలసి బాధ్యతలు షేర్ చేసుకుంటున్నట్టు వెల్లడించాడు. అన్వి తన ప్రాణమని, జీవితంలో సైంధవి, కూతురు ఇద్దరూ అత్యంత కీలకమైన వ్యక్తులేనని చెబుతున్నాడు. విడిపోయినప్పటికీ పాప భవిష్యత్తు కోసం బాధ్యతాయుతంగా కలసి ముందడుగు వేస్తున్న జీవీ ప్రకాష్ తీరును కొందరు నెటిజన్లు అభినందిస్తుంటే, మరికొందరు మాత్రం విడాకులు తీసుకోవడానికి అసలు కారణమేంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు

తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్న మండాడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ప్రమాదకర అనుభవాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమిళనాడు తీర ప్రాంతంలో జరిగే సాంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సముద్రంలోనే 45 రోజులపాటు క్లైమాక్స్ చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం సముద్రంలోకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్లమని, ఈ ప్రాజెక్ట్ కోసం తాను దాదాపు 100 రోజులు కేటాయించానని ఆయన చెప్పారు. సముద్రంలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో పడవలు తిరగబడటం వంటి ప్రమాదాలు పలుమార్లు జరిగాయని, నాలుగైదు సార్లు ఇక అయిపోయాం అనుకునే స్థాయికి వెళ్లామని సుహాస్ వివరించారు. తన కెరీర్లోనే ఇది అత్యంత ప్రమాదకరమైన అనుభవమని, ఇకపై ఇలాంటి లైఫ్ రిస్క్ ఉన్న సినిమాలు చేయనని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడు మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై ఎల్రెడ్ కుమార్ సుమారు రూ.75 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వెట్రిమారన్ వ్యవహరిస్తుండగా, సముద్రం పైన నైపుణ్యంతో నావికులను నడిపించే నాయకుడి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో హీరోగా సూరి ముత్తుకాళి పాత్రలో నటిస్తుండగా, సుహాస్ విలన్ షేడ్స్ ఉన్న సత్తపులి పాత్రలో నటిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్ జై శంకర్, బాల సరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. సముద్రంలో నిజమైన అలలు, గాలి దిశ ఆధారంగా పడవను నడపడం అత్యంత కష్టమైన ప్రక్రియ కావడం వల్ల చిత్రీకరణ సమయంలో యూనిట్కు తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 2025 అక్టోబర్ 3న రామనాథపురం జిల్లా తొండి తీరంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో సాంకేతిక సిబ్బంది ఉన్న పడవ బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగింది. ఇదిలా
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా, వైవిధ్యమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీవీ ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గాయని సైంధవితో పెళ్లి బంధం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జీవీ ప్రకాష్ తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య వైవాహిక జీవితం ముగిసినంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్కూల్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ తగ్గిపోదని తెలిపారు. అందుకే విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మంచి మిత్రులుగా రిలేషన్ మెంటైన్ చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు అన్వి బాధ్యతల గురించి కూడా జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కూతురు అన్వి తన ప్రాణమని, ఆమె భవిష్యత్తు కోసం ఇద్దరం బాధ్యతగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో సైంధవి, అన్వి ఇద్దరూ తనకు ఎంతో కీలకమైన వ్యక్తులని, ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటూ పాప పెంపకం విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదివరకు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శవంతమైన జంటగా పేరొందిన జీవీ ప్రకాష్, సైంధవిలు ఒకరినొకరు ప్రేమించుకుని 2013లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించారు. విడిపోయిన సమయంలో మీడియాలో రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ, వారు ఎంతో పరిణతితో వ్యవహరించారు. సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న జీవీ

హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మృతురాలు కమలమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహిళ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శ్రీకృష్ణ హాట్ చిప్స్ యజమాని ప్రకాష్.. నగదు, బంగారు కమ్మల కోసం కమలమ్మను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. కమలమ్మ జీతం తీసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రకాష్ ఆమెను తన షాపులోకి పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. కమలమ్మ షాపులోకి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే షాపులోకి వెళ్లిన అనంతరం ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీఫుటేజ్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కమలమ్మ వద్ద ఉన్న రూ.10 వేల నగదు, అర తులం బంగారు కమ్మల కోసమే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్
Sergio Gor Ladakh Visit News : డోనాల్డ్ ట్రంప్ ముఖ్య ప్రతినిధులలో ఒకరైన సెర్గియో గోర్.. తొలిసారిగా భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో పర్యటించారు. పలువురు దౌత్యవేత్తలతో కలిసి వచ్చిన ఆయన.. లడఖ్లోని ప్రసిద్ధ థిక్సే ఆశ్రమాన్ని సందర్శించి బౌద్ధమత విశేషాలను తెలుసుకున్నారు. అయితే ఈ పర్యటనలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని భావించిన ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాతో ఆయన సమావేశం.. చివరి నిమిషంలో రద్దు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భేటీ ఎందుకు క్యాన్సిల్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.దలైలామా భేటీ రద్దు వెనుక కారణమిదే..!దలైలామాతో జరగాల్సిన సమావేశం రద్దు కావడానికి గోర్ ఇటీవల కశ్మీర్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలే కారణమని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఇటీవలే జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సెర్గియో గోర్.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈక్రమంలోనే కశ్మీర్ను "భారత్లో అత్యంత ముఖ్యమైన భాగం" అని అభివర్ణించారు. కశ్మీర్ను సందర్శించడం ఇదే తొలిసారని, అది ఎంతో అందమైన ప్రాంతమని కొనియాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఈ కామెంట్లు కాస్త అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుని.. సెర్గియో గోర్ పేరు ప్రత్యేకంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే లడఖ్లో అమెరికా అధికారులు కాస్త వెనక్కి తగ్గి, ప్రాధాన్యత తగ్గించుకోవడానికి మొగ్గు చూపి ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి.అరగంట పాటు థిక్సే ఆశ్రమంలోనే గోర్..!లడఖ్కు చేరుకున్న గోర్.. థిక్సే ఆశ్రమంలో దాదాపు 30 నిమిషాల పాటు గడిపారు. అక్కడి బౌద్ధ సన్యాసులను అడిగి బౌద్ధ ధర్మం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తర భారత దేశంలోని లడఖ్ ప్రాంతంలో కొండపైన ఉన్న ఈ థిక్సే ఆశ్రమం.. సెంట్రల్ లడఖ్లోనే అతి పెద్దది. ఇది టిబెట్లోని ప్రసిద్ధ 'పొటాలా ప్యాలెస్'ను పోలి ఉంటుంది. లేహ్ నగరం నుంచి 19 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని 1433లో స్థాపించారు. ఇక్కడ పురాతన

మన దేశంలో 'పోస్టాఫీసు' అనగానే మైండ్ లోకి ఒక పాత భవనం, ఎర్రటి పోస్ట్బాక్స్, లేఖలను సార్ట్ చేసే ఉద్యోగులు గుర్తుకొస్తారు. కానీ, చుట్టూ నీళ్ళు, వెనక మంచు కొండల నడుమ హౌస్బోట్లో నీటిపై తేలియాడే పోస్టాఫీసును ఎప్పుడైనా చూశారా? ఇది ఏదో సినిమా దృశ్యం లేదా ఊహాజనిత కథ కాదు! జమ్మూకశ్మీర్లోని ప్రసిద్ధ శ్రీనగర్ డల్ లేక్పై నిజంగానే ఒక 'ఫ్లోటింగ్ పోస్టాఫీస్' (Floating Post Office) అందుబాటులో ఉంది. ఇప్పటికీ సజావుగా పనిచేస్తూ పర్యాటకులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టాఫీసు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో చూద్దాం: శ్రీనగర్లోని ప్రసిద్ధ డల్ లేక్, నెహ్రూ పార్క్ సమీపంలో ఈ వినూత్న పోస్టాఫీస్ ఉంది. బయటి నుంచి చూస్తే ఇది కాశ్మీర్లో కనిపించే ఒక సాధారణ సంప్రదాయ హౌస్బోట్లాగే కనిపిస్తుంది. కానీ, కాస్త దగ్గరగా వెళితే మన 'ఇండియా పోస్ట్' (India Post) పేరు, లోగోలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కేవలం పర్యాటకులు వచ్చి ఫొటోలు దిగడానికి పెట్టిన షోపీస్ అనుకుంటే పొరపాటే. సాధారణ పోస్టాఫీసులాగే ఇక్కడ కూడా ఉత్తరాలు, పార్సిళ్లు, పోస్టుకార్డులు పంపవచ్చు. డల్ లేక్ చుట్టూ ఉండే బోట్ నిర్వాహకులు, వ్యాపారులు, స్థానికులు, పర్యాటకులు రోజూ ఈ సేవలను వాడుకుంటారు. ప్రత్యేక ముద్ర (Special Stamp): ఇక్కడి నుండి పంపే ప్రతీ పోస్టుకార్డుపై డల్ లేక్ ,షికారా పడవ చిత్రం ఉన్న ప్రత్యేకమైన పోస్టల్ క్యాన్సిలేషన్ స్టాంప్ వేస్తారు. అందుకే పర్యాటకులు కాశ్మీర్ జ్ఞాపకార్థం తమ ప్రియమైన వారికి ఇక్కడి నుంచే ఉత్తరాలు రాస్తుంటారు. ఈ పోస్టాఫీసు సిబ్బంది ప్రతిరోజూ సేకరణ చేసిన పోస్టులను సేకరించి శ్రీనగర్లోని ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. అక్కడ నుంచి అవి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. అవసరమైతే ఇండియా పోస్ట్ సిబ్బంది స్వయంగా 'షికారా' పడవల్లో వెళ్ళి నీటిపై ఉండే హౌస్బోట్లలోని వారికి ఉత్తరాలను డెలివరీ చేస్తారు. చాలామంది ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ 2011లోనే

తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న రాజకీయ వివాదంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆమె తేల్చిచెప్పారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్పై తనకు గౌరవం ఉందన్నారు. అయితే రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తన విమర్శలను సమర్థించుకున్నారు. ఆ ఆరోపణలు ఇప్పటివరకు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిత్వం చుట్టూ మొదలైన వివాదమే తాజా రాజకీయ ఉద్రిక్తతకు ప్రధాన కారణంగా మారింది. పరకాలకు వచ్చిన రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటాన్ని సుస్మిత ప్రశ్నించారు. ఆగస్టు 19న గీసుకొండలో కొండా సురేఖ పుట్టినరోజు కార్యక్రమంలోనే ఆమె బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరకాల నుంచి తానే పోటీ చేస్తానని, టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమని ప్రకటించారు. అభ్యర్థిని ముందుగానే ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని కూడా ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన ప్రాంతానికి వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతు ప్రకటించడంపైనే ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సుస్మిత తెలిపారు. దీంతో తన వ్యాఖ్యలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసినవి కావని, ముఖ్యమంత్రిని మాత్రమే ఉద్దేశించినవని వివరించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి మరో పార్టీ తరహాలో మార్చుతున్నారని కూడా ఆమె ఆరోపించారు. అసలు కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉందని, బీసీ నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం సోదరుడికి సంబంధించిన రూ.200 కోట్ల భూమి లావాదేవీపై కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు స్వతంత్ర నిర్ధారణ లేదనే విషయం కీలకం. సుస్మిత వ్యాఖ్యలు బయటకు రావడంతో తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత రాజకీయ వేడి మరింత పెరిగింది. ఫలితంగా టీపీసీసీ
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రత్యేక పాత్రలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ఒక కీలక పాత్ర గురించి వస్తున్న వార్తలకు నిర్మాతల వైపు నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. గతంలో వచ్చిన టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ వినిపించడంతో, ఈ భారీ కాప్ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కథనంలో ఉన్న ఒక పవర్ ఫుల్ జైలర్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్ను సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని ప్రణయ్ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా బలం చేకూరినట్లయింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో చేయనున్నారని సాగుతున్న ప్రచారానికి కూడా ప్రణయ్ ముగింపు పలికారు. 'స్పిరిట్' లో చిరంజీవి ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని తేల్చి చెప్పారు. కాస్టింగ్ పరంగా క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారిగా పూర్తిస్థాయి రోషకలిగిన పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతుండడం మెగా మాస్ ఎలిమెంట్స్ని పెంచేస్తోంది. నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు

దేశంలో మొబైల్ కనెక్షన్ల జారీలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వీటిని అమల్లోకి తీసుకుని రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు సైతం రూపొందించింది.. టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ. సిమ్ కార్డుల జారీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే కఠినంగా ఈ నూతన నిబంధనలను అమలులోకి తేబోతోంది.మొబైల్ కనెక్షన్లు, సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒక వ్యక్తి తన పేరు మీద నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు కలిగి ఉంటే, వారికి నూతనంగా మరో సిమ్ కార్డు జారీ చేయకూడదని కేంద్రం టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. అంటే.. పరిమితి మించిన వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన సిమ్ అనేది ఇవ్వరు. వీటిని పూర్తిగా నిలిపివేయనున్నారు.తాజా టెలికాం నిబంధనల ప్రకారం.. దేశంలో ఒక పౌరుడు తన ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలపై గరిష్టంగా తొమ్మిది మొబైల్ కనెక్షన్లను మాత్రమే పొందేందుకు అనుమతి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రత కారణాల రీత్యా ఈ పరిమితిని గరిష్టంగా ఆరు సిమ్ కార్డులుగా నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల యూజర్లు ఆరుకు మించి ఎక్కువ సిమ్ కార్డులను పొందలేరు. వేర్వేరు టెలికాం కంపెనీల సిమ్ కార్డులను వాడుతున్నప్పటికీ కూడా మొత్తంగా ఉండాల్సిన కనెక్షన్ల సంఖ్య ఈ లిమిట్ దాటకూడదు.వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్వినియోగదారులకు ఇప్పటికే వివిధ నెట్వర్క్ లలో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని రియల్ టైమ్ లో సరిపోల్చుకోవడానికి టెలికాం కంపెనీలన్నీ కూడా డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ డిజిటల్ డేటాబేస్ ఆధారంగానే నూతన కనెక్షన్లు కోరేవారి అర్హతను ఆపరేటర్లు పరిశీలిస్తారు. ఇప్పటికే గరిష్ట పరిమితిని దాటిన వినియోగదారులు మరో

రవితేజ 'ఇరుముడి' ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అమెరికా ప్రీమియర్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అత్యంత సానుకూల స్పందనను సొంతం చేసుకుంటోంది. భారీ అంచనాలు మరియు ముందస్తు బుకింగ్స్ఆధ్యాత్మిక అంశాలు మరియు ఫ్యామిలీ డ్రామా కలబోతగా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ మరియు ట్రైలర్లలో రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపించడంతో ప్రేక్షకుల్లో విశేష ఆసక్తి నెలకొంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. కథలోని లోతు మరియు పేరెంటింగ్ సందేశంకేవలం డివోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా కథలో మరింత లోతైన సామాజిక కోణాన్ని దర్శకుడు జోడించారు. ముఖ్యంగా ఆడపిల్లల పెంపకం మరియు పేరెంటింగ్ శైలిపై ప్రతి ఒక్కరినీ తీవ్రంగా ఆలోచింపజేసేలా సన్నివేశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తండ్రీ కూతుళ్ల అనుబంధంతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ సెంటిమెంట్ కూడా తొలి భాగంలో బాగా ఆకట్టుకుంటోంది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు మరియు సంగీతంప్రథమార్ధంలో ఎమోషన్స్తో పాటు థ్రిల్లింగ్ సన్నివేశాలను శివ నిర్వాణ సమర్థవంతంగా మేళవించారు. ఇంటర్వెల్ బ్లాక్ మరియు కథలోని కీలక మలుపు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారగా, 'మల్లెపూల పల్లకి' పాట వచ్చే సన్నివేశం థియేటర్లలో మంచి స్పందన పొందుతోంది. ఈ నేపథ్యంలో రొటీన్ కమర్షియల్ ముగింపు కాకుండా ఎమోషనల్ క్లైమాక్స్ను ఎంచుకోవడం సినిమా స్థాయిని పెంచింది. రవితేజ కెరీర్లో సరికొత్త మైలురాయిఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం రవితేజ తన రొటీన్ మాస్ శైలిని పక్కనపెట్టి ఇంటెన్స్ నటనను కనబరిచారు. దీంతో ఆయన నటనపై మరియు ఎంచుకున్న పాత్రపై సర్వత్రా ప్రశంసలు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో ఏ పని అయినా చాలా కష్టపడి చేస్తారు. తాము అనుకున్న పనులు పూర్తయ్యేంత వరకు విశ్రాంతి అనేదే తీసుకోరు. అందుకే వీరికి వరమహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. వీరు తాము చేసే పనులన్నీ నిజాయితీగా చేస్తారు. అంతేకాదు వీరికి నాయకత్వ సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు జీవితంలో బాగా రాణిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా మహాలక్ష్మీ అనుగ్రహం భారీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ కారణంగా వీరికి జీవితంలో వీరికి డబ్బు లోటు అనేదే ఉండదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వరమహాలక్ష్మీ అనుగ్రహంతో వీరు అన్ని రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. వీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలున్నాయి. అంతేకాదు వీరు నలుగురిలో చాలా సులభంగా కలిసిపోతారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో వీరు సురక్షితమైన జీవించడానికి ఇష్టపడతారు. మిథున రాశి వారు బుధుడి ప్రభావంతో చాలా సౌమ్యంగా ఉంటారు. వీరు వరమహాలక్ష్మీ అనుగ్రహంతో మానసికంగా చాలా బలంగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచి సక్సెస్ కూడా సాధించొచ్చు. కెరీర్ పరంగా అద్భుతమైన విజయం సాధిస్తారు. కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. వీరు ఎల్లప్పుడూ నిజాయితీతో పని చేస్తారు. అందుకే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. వీరు ఎలాంటి పనులైనా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే వీరు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. అంతేకాదు వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభించడంతో వీరికి ఆర్థిక సమస్యలేనే ఉండవు. రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ ప్రేక్షకులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది. దాంతో ఈసారి రెబల్ స్టార్ కు సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే వరుసగా సినిమాలను లైనప్ చేసిన ప్రభాస్ ఆయా షూటింగ్స్ లో యమా బిజీగా ఉన్నాడు. వాటిలో ముందుగా వచ్చేది మాత్రం స్పిరిట్ సినిమానే.. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లో ఆసక్తి రెట్టింపైంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను నెక్ట్స్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు స్పిరిట్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు ప్రభాస్ ను స్పిరిట్ లో ఎలా చూపించబోతున్నడో అంటూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇప్పటికే హింట్ ఇచ్చాడు సందీప్.. స్పిరిట్ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్ ఇక ఈ మూవీలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా నుంచి ఓ స్టార్ నటుడు తప్పుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు ప్రకాష్ రాజ్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రాజ్ కీలక పాత్రలో ఎంపిక చేశారట. అయితేఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఓ సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడంతో ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు

ప్రభాస్ 'స్పిరిట్' మూవీ కాస్టింగ్పై బిగ్ అప్డేట్పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపుదిద్దుకుంటున్న స్పిరిట్ చిత్రంపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కాస్టింగ్కు సంబంధించి ఒక కీలకమైన ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. ఈ మూవీలో వర్సటైల్ నటుడు ప్రకాశ్ రాజ్ భాగం కావడం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. స్పిరిట్ టీజర్లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ వినిపించడంతో ఆయన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అందరూ భావించారు. జైలర్ పాత్ర కోసం ముందుగా ఆయన పేరునే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదని వార్తలు వచ్చాయి. నిర్మాత ప్రణయ్ వంగా అధికారిక క్లారిటీఈ వ్యవహారంపై స్పిరిట్ చిత్ర నిర్మాత ప్రణయ్ వంగా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్లో నటించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది. ఫలితంగా జైలర్ పాత్రలో వేరొక నటుడు కనిపించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. చిరంజీవి క్యామియో రోల్పై స్పష్టత ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలను కూడా నిర్మాత ప్రణయ్ వంగా ఖండించారు. ఈ నేపథ్యంలో సినిమాలో చిరంజీవి ఎలాంటి క్యామియో రోల్ చేయడం లేదని తేలిపోయింది. షూటింగ్ మరియు ఇతర నటీనటుల వివరాలు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల ఎంపికపై దృష్టి సారించింది. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'ఇరుముడి'. భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ అంశాల మేళవింపుతో వచ్చిన ఈ సినిమాపై తొలి నుంచే పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజను సరికొత్త ఆధ్యాత్మిక, కుటుంబ నేపథ్యంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే విదేశీ ప్రీమియర్లను పూర్తి చేసుకుని పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది.ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. మద్యం వ్యసనానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకునే ఒక సాధారణ గ్రామీణ తండ్రి చుట్టూ తిరుగుతుంది. తన కన్నకూతురి ప్రేమ, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం అతడు పవిత్రమైన 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షను చేపడతాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి, అమాయకపు ఆడపిల్లలకు ఎదురయ్యే ఊహించని ప్రమాదం నుంచి దీక్షా నియమాలను పాటిస్తూనే అతడు తన కుటుంబాన్ని, ఊరిని ఎలా కాపాడాడనే అంశాన్ని దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఆకట్టుకునే తండ్రీ కూతుళ్ల బంధంయూఎస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ స్పందనను పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో నిజాయితీగా, మలయాళ చిత్రాల తరహా సహజత్వంతో సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, పాఠశాల నేపథ్యంలో మొదలయ్యే సన్నివేశాలు, కథలోని అంతర్లీన ఉత్కంఠ ఫస్టాఫ్ను ఆసక్తికరంగా నడిపించాయి. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినప్పటికీ, ఇంటర్వెల్ సమయానికి వచ్చే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.సెకండాఫ్లో ఊహించని ట్విస్టులుఇక సెకండాఫ్లో కథలోని ఎమోషన్స్ పీక్స్కి చేరుకుంటాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఊహించని ట్విస్టులు, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'మల్లెపూల పల్లకి' భక్తి గీతం నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసిస్తున్నారు. ట్విస్ట్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వివాదంలో చిక్కుకున్నాడు. జూనియర్ స్థాయిలో క్రికెట్ సెలక్షన్ ఎంపిక సమయంలో అతడు పుట్టిన తేదీని మార్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, మాజీ డిప్యూటీ ఎస్పీ సుదర్శన్ మెహతా స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో భారత న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 175 (3) ప్రకారం.. చీటింగ్, ఫ్రాడ్, పుట్టిన తేదీ ఫోర్జరీ తదితర ప్రొవిజన్లకు అనుగుణంగా మన్హాస్పై నౌబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పిటిషనర్ అందించిన వివరాల ప్రకారం.. మిథున్ మన్హాస్ జూనియర్ లెవల్, నేషనల్ లెవల్లో క్రికెట్ ఆడే సమయంలో వేర్వేరు పుట్టిన తేదీలను నమోదు చేశారు. పోలీసులకు కోర్టు ఆదేశాలు సబ్ జూనియర్, జూనియర్ కేటగిరీలలో అర్హత పొందేందుకు ఈ మేరకు అక్రమాలకు పాల్పడ్డాడని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన స్థానిక కోర్టు సెప్టెంబరు 3లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ తరఫున కాగా 45 ఏళ్ల మిథున్ మన్హాస్ సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్. అయితే, దేశవాళీ క్రికెట్లో అతడు ఎక్కువగా ఢిల్లీ జట్టుకు ఆడాడు. కెప్టెన్గానూ పనిచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి అనుభవం ఉన్న మిథ/న్.. 157 మ్యాచ్లు ఆడి 9714 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు కూడా ఉన్నాయి. ఇక లిస్ట్-ఎ క్రికెట్లో 130 మ్యాచ్లలో కలిపి మిథున్ 4126 పరుగులు సాధించాడు. అదే విధంగా 91 టీ20 మ్యాచ్లు ఆడి 1179 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్ చరమాంకంలో మిథున్ మన్హాస్ 2015లో జమ్మూ కశ్మీర్ క్రికెట్ సబ్ కమిటీ మెంటర్గా పనిచేశాడు. ఆ మరుసటి ఏడాది కెరీర్కు వీడ్కోలు

ఇంటర్నెట్ డెస్క్: లద్దాఖ్ (Ladakh)లోని మినామార్గ్ చెక్పోస్టు వద్ద భద్రతా సిబ్బందితో పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మిజోరం గవర్నర్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (Gen VK Singh) స్పందించారు. భద్రతా సిబ్బందిపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. దేశాన్ని కాపాడే రక్షణ కవచంగా సాయుధ బలగాలు పనిచేస్తున్నాయని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సైనికులను అన్యాయంగా నిందించడం, నిరాధార ఆరోపణల చేయడం సరికాదన్నారు. దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు తాము అండగా ఉంటామని చెప్పారు. మినామార్గ్ ప్రాంతంలో ఉన్న చెక్పోస్టు (Minamarg checkpoint) వద్ద వాహనాలను గంటల పాటు నిలిపివేశారని ఓ పర్యాటకురాలు భద్రతా సిబ్బందిపై విరుచుకుపడింది. కుటుంబాలు, చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్న వారిని అంతసేపు ఎందుకు నిలిపివేశారని ఆమె అక్కడి సిబ్బందిని గట్టిగా ప్రశ్నించారు. తాము ‘జెన్ జీ’ (Gen Z) తరానికి చెందిన వారమని, ఇలాంటి పరిస్థితులను అస్సలు సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భద్రతా కాన్వాయ్ అక్కడికి రావడంతో, ఆమెను రోడ్డు పక్కకు వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచించారు. రహదారిని కేవలం వీఐపీ కాన్వాయ్ కోసమే మూసివేశారని సదరు పర్యాటకురాలు ఆరోపించినట్లు సమాచారం. అయితే ఆ ఆరోపణలు ఎంత వరకు నిజమనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Ladakh Tourist Video) ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భద్రత, ప్రతికూల వాతావరణం, రోడ్డు పరిస్థితుల కారణంగా మినామార్గ్-జోజిలా మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ వైరల్ వీడియోపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. పాత రోజుల్లో కొందరు రాజకీయ నాయకుల పిల్లలు ‘నా తండ్రి ఎవరో నీకు తెలుసా? అంటూ బెదిరింపులకు దిగేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ‘మేము జెన్-జీ’ అనేది ఒక కొత్త

భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. దుర్భేద్యమైన కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే క్రమంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతమైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై మన ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై గంటకు దాదాపు 100 కి.మీ వేగంతో శరవేగంగా ప్రయాణించి, భారత్ తన రవాణా సాంకేతికతతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది.ఉత్తర రైల్వే పరిధిలోని శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి బనిహాల్ వరకు ఉన్న 111 కిలోమీటర్ల పొడవైన నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. గతంలో ఈ మార్గంలోని కత్రా-సంగల్దాన్ సెక్షన్లో గంటకు 85 కి.మీ, అలాగే సంగల్దాన్-బనిహాల్ సెక్షన్లో గంటకు 75 కి.మీ మాత్రమే గరిష్ట వేగానికి అనుమతి ఉండేది. అయితే అన్ని రకాల ముందస్తు భద్రతా తనిఖీలను సమర్థవంతంగా పూర్తి చేసి నిబంధనలు పాటించడంతో అధికారులు ఈ స్పీడ్ లిమిట్ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 24-కోచ్ల వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దం: తెలుగు రాష్ట్రాలకు ఇలా, రూట్.. షెడ్యూల్..!!సమయం ఆదా.. పర్యాటకానికి సరికొత్త జోష్!నూతన వేగ పరిమితి అమలులోకి రావడంతో కత్రా - బనిహాల్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కాశ్మీర్ లోయలో ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనుంది. జమ్మూ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ స్పందిస్తూ.. ఈ వేగం పెరుగుదల ప్రాంతీయ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. ప్రయాణికుల రాకపోకలకు సమయం తగ్గడంతో పాటు స్థానిక పర్యాటక రంగం, వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పురోగతికి ఈ రైలు మార్గం భారీ ఊతాన్నిస్తుందని

Jagamae Sangeetham : చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు తీయగా తాజాగా మరో కొత్త సిరీస్ ని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మాణంలో మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన శబ్దంతో అందంగా మేళవించిన హృద్యమైన స్వరకల్పనల ద్వారా విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్కి ప్రాణం పోశారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి.. కీలక పాత్రల్ని పోషించారు. సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి నాకిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, కేస్కావ్ రెడ్డి, రూప లక్ష్మి.. పలువురు ఈ సిరీస్ లో నటించారు. Also See : Supritha : పెంపుడు కుక్క పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన సుప్రీత.. ఫొటోలు… ‘జగమే సంగీతం’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు నేడు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కర్ణాటక సంగీతం చుట్టూ తాత, మనవడి కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా, SVOD ఒరిజినల్స్ డైరెక్టర్, హెడ్ మాట్లాడుతూ.. కుటుంబం, వారసత్వం, ఆత్మశోధన వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తూనే, సంగీతంలోని భావోద్వేగ శక్తిని ఈ జగమే సంగీతం కథ చెప్తుంది. హత్తుకునే సంగీతం ఈ సిరీస్ లో ఉంది అని అన్నారు. నిర్మాత

ఈ యేడాది 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో నిర్మాతగా చక్కని విజయాన్ని అందుకున్న సుస్మిత కొణిదెల తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం 'జగమే సంగీతం' వెబ్ సీరిస్ నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా మరో వెబ్ సీరిస్ రాబోతోంది. గతంలో ఆమె 'షూట్ అవుట్ ఎట్ ఆలేర్' వెబ్ సీరిస్ తోనే నిర్మాతగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత 'సేనాపతి' పేరుతో ఓ వెబ్ ఫిల్మ్ తీశారు. ఆపైన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తన తండ్రి చిరంజీవి కథానాయకుడిగా ఈ యేడాది ఆమె నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'మన శంకర వర ప్రసాద్' అఖండ విజయాన్ని అందుకుంది. ఆ స్ఫూర్తితో ఇప్పుడు అమెజాన్ కోసం 'జగమే సంగీతం' వెబ్ సీరిస్ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించిన మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సీరిస్ 'బందిష్ బాండిట్స్' స్ఫూర్తితో తెలుగులో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో దీనిని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచించిన ఈ మ్యూజికల్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సిరీస్కు బ్యాక్ బోన్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సీరిస్ గురించి దర్శకుడు సూర్యప్రతాప్ చెబుతూ, 'కర్ణాటక సంగీతపు గొప్ప ప్రపంచ నేపథ్యంలో సాగే కథతో 'జగమే సంగీతం' రాబోతోంది. తన తాత శాస్త్రి గారి ప్రఖ్యాత సంగీత వారసత్వానికి వారసుడైన బాలు, సంప్రదాయ భారం, విచ్ఛిన్నమైన కుటుంబ బంధాలు, చిరకాలంగా దాచిపెట్టిన రహస్యాలతో సతమతమవడాన్ని చూపిస్తుంది. పాత వైరుధ్యాలు మళ్లీ తలెత్తి, తరతరాల వారసత్వాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, బాలు

మాస్ మహారాజా రవితేజ రేపు ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచి ఇరుముడితో వరల్డ్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాడు. సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలు పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఇరుముడి వీక్షించడానికీ థియేటర్స్ దగ్గర బారులు తీరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A 16+ సర్టిఫికెట్ లభించగా, రన్టైమ్ 2 గంటల 25 నిమిషాలు. సెన్సార్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ ప్రకారం, రవితేజ కెరీర్లోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ పవర్ ప్యాక్డ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతోంది. ఈ కథలో రవితేజ "త్రినాథ్" అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. మొదట్లో మద్యానికి విపరీతంగా బానిసైన నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ నటన మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. తన భార్య (ప్రియా భవానీ శంకర్), ముద్దుల కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర)లతో సాధారణ జీవితం గడుపుతున్న క్రమంలో, కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప మాల ధరిస్తారు. మద్యానికి బానిసైన ఒక తండ్రి అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి, నిష్టగా మాల ఎలా కొనసాగించాడు అనేది సినిమాకు ప్రధాన హైలైట్గా మారనుంది. అంతేకాకుండా, ఊరిలో ఆడపిల్లలకు ముప్పు తలపెడుతున్న ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామాను దర్శకుడు శివ నిర్వాణ ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్కు అద్భుతంగా ముడిపెట్టారు. తన కూతురితో పాటు గ్రామంలోని మహిళల రక్షణ కోసం అయ్యప్ప దీక్షలో ఉన్న త్రినాథ్ ఏ విధంగా పోరాడాడు అనే అంశం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం. మాస్ యాక్షన్కి తోడుగా భక్తి రసం, తండ్రీ కూతుళ్ల మధ్యన సాగే ఎమోషనల్
కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మకుటం' డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో తనదైన మార్క్ మాస్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు బుల్లితెర వీక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్పైకి రాబోతోంది. మాస్, యాక్షన్ తో పాటు విపరీతమైన ఎమోషన్స్ నింపడంలో విశాల్ నైపుణ్యం ప్రత్యేకమైనది. తమిళంతో పాటు తెలుగునాట కూడా ఆయన సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే.. విశాల్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా, ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. కథానాయికలుగా అంజలి, దుషారా విజయన్ నటించగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కథ విషయానికి వస్తే.. కృపాకర్ అనే సాదాసీదా ఉద్యోగి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. సరదాగా విహారయాత్రకు వెళ్లిన సమయంలో అనుకోకుండా ఒక రౌడీ ముఠా అతని కారుపై దాడి చేస్తుంది. ఈ ప్రమాదంలో భార్యాపిల్లలను కోల్పోయిన కృపాకర్, ఆ దుండగులపై ఎలా పగ తీర్చుకున్నాడు? ఆ గ్యాంగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ రివెంజ్ డ్రామా తెరకెక్కింది. విశాల్ కి గతంలో 'పందెం కోడి', 'అభిమన్యుడు', 'మార్క్ ఆంటోని' వంటి విలక్షణమైన యాక్షన్ చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ లభించింది. అదే తరహాలో 'మకుటం'లో ఆయన చూపించిన వైవిధ్యమైన నటనకు, ముఖ్యంగా తండ్రీ కొడుకుల పాత్రల నడుమ ఉన్న వ్యత్యాసానికి ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా డిజిటల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో మాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ మిస్సయిన యాక్షన్ లవర్స్ ఈ సినిమా

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి రేపు అంటే ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గత చిత్రాలకు భిన్నంగా 'ఇరుముడి'గతంలో రవితేజ అంటేనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ సినిమాలను ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే, ఈసారి దర్శకుడు శివ నిర్వాణ ఆయనను పూర్తి భిన్నమైన, ఎమోషనల్ పాత్రలో చూపించబోతున్నారు. గతేడాది డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం, కేవలం 45 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయ్యప్ప దీక్షా నేపథ్యంలో భావోద్వేగ కథఈ చిత్రంలో రవితేజ ఆటో డ్రైవర్గా, తాగుడుకు బానిసైన తండ్రి పాత్రలో కనిపిస్తారు. తన కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప దీక్ష పూనడం, ఆ తర్వాత ఆయన జీవితంలో వచ్చే మార్పులే కథాంశం. దీంతో, ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందింది. చివరి 40 నిమిషాలు కీలకంసినిమాలోని చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని దర్శకుడు శివ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, రవితేజ నటనలో కొత్త కోణాన్ని చూస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ భావోద్వేగ సన్నివేశాలకు ప్రాణం పోసిందని సమాచారం. భారీగా బుకింగ్స్అల్లు సినిమాస్ ద్వారా బుక్ మై షోలో ఇప్పటికే టికెట్ల బుకింగ్స్ ఊపందుకున్నాయి. 'ది మాస్ ఈజ్ బ్యాక్' అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించగా, సాయికుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు. సినిమాపై అంచనాలుసాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగే ఈ సీరియస్ డ్రామా తెలుగు

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ ఇప్పుడు కోలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తమిళ అరంగేట్ర చిత్రం మండాడి నుంచి చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో సుహాస్ ఎప్పుడూ లేని విధంగా పూర్తి నెగిటివ్ షేడ్స్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చేతికి ఉంగరం, గడియారంతో పాటు తీవ్రమైన హావభావాలు కలిగి ఉన్న ఆయన లుక్ యాక్షన్ సీక్వెన్స్కు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మండాడి చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెల్ఫీ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు మతిమారన్ పుగళేంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ ప్రముఖ నటుడు సూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తుండగా, సుహాస్ ప్రధాన ప్రతికథకుడిగా సాతపులి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుండగా, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాలా శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళనాడు తీరప్రాంత మత్స్యకారుల యథార్థ జీవితాలు, సముద్రంలో జరిగే పడవ పందాల నేపథ్యంతో సాగుతుంది. ఇదిలా ఉండగా సముద్రంలో జరిగే పందాల విజువల్స్ జల్లికట్టు స్థాయిలో ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయని సమాచారం. దీంతో సూరి, సుహాస్ పాత్రల మధ్య ఘర్షణ అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఈ విలన్ పాత్ర యొక్క ప్రాధాన్యతను బట్టి సుహాస్ ఈ సినిమా కోసం 100 రోజులకు పైగా చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఎస్ఆర్ కతీర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ పూర్తయి, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు

రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇరుముడి’ (Irumudi) చిత్రానికి చాలా అవార్డులు వస్తాయని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ (GV Prakash Kumar) అన్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాలకు వినసొంపైన మెలోడీలు ఇచ్చి మ్యూజిక్ ప్రియులకు చేరువైన ఆయన, సంగీతం అందించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు జీవీ ప్రకాశ్కుమార్. ‘నేను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ‘ఇరుముడి’ చాలా ప్రత్యేకం. ఇదో ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథ చెప్పినప్పుడే ఇందులో పూర్తిగా లీనమైపోయాను. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనమిచ్చే చిత్రమిది. ప్రతీ క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులోని సంగీతానికి ఓ సైకలాజికల్ అప్రోచ్ ఉంటుంది. ‘మల్లెపూల పల్లకి’ పాటను రీక్రియేట్ చేసి అందరి అంచనాలను అందుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ నటించిన వాటిలో నా ఫేవరెట్ ‘ఇరుముడి’ చిత్రం. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంది’ అని చెప్పారు

Singareni: దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి సింగరేణి: రాష్ట్ర దేశ ఇంధన భద్రతకు సింగరేణి సంస్థ తగినంత బొగ్గును అందించడంతో పాటు పునరుత్పాతక విద్యుత్తు రంగంలో కూడా తన వంతు కృషి చేస్తుందని సింగరేణి సంస్థ ఛైర్మన్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్ పో కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన భారత ఇంధన భద్రత విద్యుత్ ఉత్పత్తి అనే గోష్టిలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దశాబ్దాల కాలంగా దేశ ఇంధన అవసరాలకు తనవంతుగా బొగ్గు అందిస్తూ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి రాష్ట్ర జెన్ కో మరియు ట్రాన్స్ కో కలిసి సమష్టిగా కృషి చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ మరియు క్రిటికల్ మినరల్ రంగంలోకి కూడా ప్రవేశించిందని, అయినప్పటికీ దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి మరో నాలుగు దశాబ్దాల పాటు డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు. కనుక సింగరేణి సంస్థ రానున్న కాలంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కృషి చేస్తుందని అలాగే పునరుత్పాతక ఇంధన రంగంలో కూడా తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని తెలిపారు. ఈ చర్చ గోష్టికి ప్రొఫెసర్ పవన్ కుమార్ పరనంది సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ ఎనర్జీ సమ్మిట్ కు తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ హాజరుకాగా... ప్యానెల్ డిస్కషన్ లో సింగరేణి ఛైర్మన్ తో పాటు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ సీఎండీ శ్రీ దేవేంద్ర శృంగి, ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Mandaadi Movie: సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రం ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త ఇంటెన్స్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మండాడి’లో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన సినిమా పోస్టర్లు, ఇతర ప్రచార కంటెంట్కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో బోట్ సీక్వెన్స్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఆ సన్నివేశాలను రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా విడుదలైన పోస్టర్లో సుహాస్ పూర్తిగా కొత్త లుక్లో కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్ ఈ పోస్టర్లో ప్రత్యేకంగా నిలిచింది. చేతికి ఉన్న ఉంగరం, వాచ్, గడ్డం, సీరియస్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పోస్టర్లో సుహాస్ కనిపిస్తున్న తీరు చూస్తే సినిమాలో ఆయన పాత్ర చాలా ఇంటెన్స్గా ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది. ఆయన చుట్టూ కనిపించే వస్తువులు కూడా సినిమాలోని కథ, పాత్ర గురించి ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపాయి. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సీఎం కోరడంపై మండిపడిన సుస్మిత, పరకాల బరిలో తాను కచ్చితంగా పోటీ చేస్తానని బహిరంగ సవాల్ విసిరారు
ఆమెకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు.. కొండా సుస్మితకు రేవూరి కౌంటర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఘాటుగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని, ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే సీఎం రేవంత్ తనను పరకాల అభ్యర్థిగా ప్రకటించారని రేవూరి తెలిపారు. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేని వ్యక్తి అని, సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని మండిపడ్డారు. దమ్ముంటే సీఎంపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ వార్తకు సంబంధించిన

అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు. టైటిల్ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్లైన్ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్లైన్ వెనుక

కార్గిల్లో భద్రతా సిబ్బందితో ఒక మహిళా పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. "మేం జెన్-జీ" అంటూ ఆ యువతి చేసిన వ్యాఖ్యను, గతంలో హోదాను ప్రదర్శించేందుకు వాడే "నా తండ్రి ఎవరో తెలుసా?" అనే అహంకారపూరిత మాటతో ఆయన పోల్చారు.బుధవారం 'ఎక్స్' వేదికగా ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, "నా తండ్రి ఎవరో తెలుసా' అనే మాట స్థానంలో ఇప్పుడు 'మేం జెన్-జీ' అనే కొత్త పదం వచ్చి చేరింది. చిన్న చిన్న విషయాలకే ఇలా 'జెన్-జీ' అంటూ బెదిరింపులకు దిగితే, ఆ తరం పట్ల సమాజంలో ఉన్న సద్భావనను వేగంగా దెబ్బతీయడమే అవుతుంది" అని తన పోస్ట్లో పేర్కొన్నారు.అసలేం జరిగింది?లద్దాఖ్లోని కార్గిల్లో ఉన్న మినీమార్గ్ చెక్పాయింట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జులై 25న కార్గిల్ విజయ్ దివస్కు ఒక రోజు ముందు, వాతావరణం అనుకూలించకపోవడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. వారి కాన్వాయ్ సజావుగా సాగేందుకు జోజిలా-గుమ్రి మార్గంలో ట్రాఫిక్ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ యువతి, భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. "మేం జెన్-జీ, ఇలాంటి అర్థం లేని పనులను సహించం. ఇప్పటివరకు కశ్మీరీలతోనే ఇలా ప్రవర్తించేవారు, ఇప్పుడు పర్యాటకులతో కూడా మొదలుపెట్టారా?" అని ఆమె ప్రశ్నించడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన జులై 25న జరగ్గా, ఆగస్టు 19న ఈ

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఘట్టమనేని జయకృష్ణ. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన అతను 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. రోటీన్ స్టోరీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అనుకున్న కలెక్షన్లు రావడం లేదు. అయితే మాస్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే థియేటర్లలో రిలీజైన 20 రోజులకే శ్రీనివాస మంగాపురం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20 అంటే రేపటి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని నిర్మించగా, ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, అజయ్, శామ్, నరేష్, బ్రహ్మాజీ, మహేంద్రన్, వాసుకీ ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శ్రీనివాస మంగాపురం సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతి నేపథ్యంలో ప్రేమ, పగ, ప్రతీకారాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. థియేటర్లలో మిస్

పరకాలలో వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని, మళ్లీ ఆయనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఇటీవల జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయన్న కొండా సుస్మితగత ఎన్నికలలో ఐదారు నియోజకవర్గాలలో విజయం సాధించడానికి తన తండ్రి కొండా మురళి ఎంతో కష్టపడ్డారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొండ మురళి రేవంత్ రెడ్డి కళ్ళకు కనిపించడం లేదని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని కొండా సుస్మిత అన్నారు. అంతేకాదు సీఎం రేవంత్రెడ్డిని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత హెచ్చరించారు.రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతా: కొండా సుస్మిత ఈరోజు కొండా సురేఖ జన్మదిన వేడుకలను పరకాలలో నిర్వహించగా ఆ కార్యక్రమంలో కొండ సుస్మిత పాల్గొన్నారు. భారీ కాన్వాయ్ తో బలప్రదర్శన చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. తను చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతానని అన్నారు. తమ్ముడి రూ.200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే ఇప్పటివరకు మాట్లాడానని, కౌంటర్ ఇస్తే అన్నీ బయటపెడతానని హెచ్చరించారు.పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్న కొండా సుస్మితఅంతేకాదు పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదని, రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకు కూడా తెలియదని అన్నారు. గత ఎన్నికల సమయంలో కొండా మురళి రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచాడని వ్యాఖ్యలు చేశారు. పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్న కొండా సుస్మిత, రేవూరి ప్రకాష్ రెడ్డిని రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు అభ్యర్థిగా ఇప్పుడే ప్రకటించడంపైన అసహనం వ్యక్తం చేశారు.రాజీనామా చేసి పోటీ

దశాబ్దాలుగా భారత్ లో కాశ్మీర్ అంతర్భాగంగా ఉన్నా, అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే పాలిస్తున్నా.. ఈ ప్రాంతం తమదే అంటూ అంతర్జాతీయ వేదికలపై చెప్పుకునే పాకిస్తాన్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor)జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ భారత్ లో ఓ ముఖ్యమైన అంతర్భాగమని సెర్గియో గోర్ తేల్చిచెప్పేశారు. దీంతో పాటు కాశ్మీర్ కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.దారుణంగా పడిపోయిన భారత్ ఇమేజ్- అమెరికన్లలో సగం- తాజా సర్వేలో షాకింగ్..!ఆర్టికల్ 370 రద్దు, పహల్గాం దాడుల తర్వాత ఒక అమెరికా రాయబారి శ్రీనగర్ కు రావడం ఇదే తొలిసారి. ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉందని, ఇది భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగమని సెర్గియో తెలిపారు. తాను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అని, ఇది అద్భుతమైన అందమైన ప్రదేశమని కితాబిచ్చారు. ఇక్కడ ఉండటం, ఈ ప్రదేశాన్ని చూడటం తనకు చాలా ఉత్సాహాన్నిస్తోందన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా విధించిన అత్యున్నత స్థాయి ప్రయాణ హెచ్చరికను తగ్గించడంపై పునరాలోచిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉగ్రవాద ముప్పు కారణంగా జమ్మూ కాశ్మీర్ పై అమెరికా లెవల్ 4 అంటే ప్రయాణించవద్దనే హెచ్చరికను అమలు చేస్తోంది. దీన్ని తగ్గిస్తామని సెర్గియో హామీ ఇచ్చారు. పాకిస్తాన్ కూటమికి భారత్ ఝలక్..! ఈజిప్ట్ నిర్ణయం వెనుక ?గోర్ పర్యటనకు ముందే, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. ఈ లోయలోని వేలాది కుటుంబాలు జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అమెరికా తమ కఠినమైన ప్రయాణ హెచ్చరికను సమీక్షించి ఉపసంహరించుకోవాలని ఆయన్ను కోరారు. మరోవైపు సెర్గోయో గోర్.. రేపు లడఖ్లో పర్యటిస్తారు. 2020 నాటి గల్వాన్ ఘర్షణ, చైనాతో