
Mahendragiri Varahi Review: ‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ.. వాట్ ఏథ్రిల్లర్!
Mahendragiri Varahi Review: ‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ.. వాట్ ఏ థ్రిల్లర్!
© 2026 nimisham.in

Mahendragiri Varahi Review: ‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ.. వాట్ ఏ థ్రిల్లర్!

Mahendragiri Varahi Review: 33ఏళ్లకే మరణం.. ఊహించని ట్విస్టులు.. కాంతారా, విరూపాక్షతరహాలో సుమంత్ మూవీ!

IFA 2026 Unusual Tech : IFA 2026లో అసాధారణ టెక్ గాడ్జెట్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 17-అంగుళాలుగా మారే లెనోవో ప్రాజెక్ట్ స్వాన్ నుంచి డిటాచబుల్ Hohem కెమెరా, డైసన్ కెమెరా జెట్, బెల్కిన్ మ్యాగ్ సేఫ్ స్టాండ్, అంకెర్ 100W యూనివర్సల్ చార్జర్ ఆకట్టుకునేలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..

టాక్సిక్ (Yash) సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయిన యష్ ఇప్పుడు తన కెరీర్లో మరోసారి KGF మ్యాజిక్ను రిపీట్ చేయాలని చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను.. ఈ ఇద్దరూ రామ్ ప్రసాద్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. (Jabardasth Ram Prasad)

Mahendragiri Varahi Movie Review: మహేంద్ర గిరి వారాహి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Mahendragiri Varahi | మహేంద్రగిరి వారాహి రివ్యూ: సుమంత్ కొత్త థ్రిల్లర్ ఎలా ఉంది?

సుమంత్ నటించిన చిత్రం మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi OTT) ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే విషయం తెలిసిపోయింది.

Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి ట్రైలర్ బాగుండటం, సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఉన్నాడు అని తెలియడం, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Mahendragiri Varahi Twitter Review: మహేంద్రగిరి వారాహి ట్విట్టర్ రివ్యూ..

ఎరుపు డ్రాగన్ ఫ్రూట్ vs తెల్ల డ్రాగన్ ఫ్రూట్... రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది?

Dragon: యన్టీఆర్కు ఈ గ్యాప్ కలిసొస్తుందా!?

Xiaomi 17 Ultra Price : షావోమీ 17 అల్ట్రాపై అమెజాన్లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. యాక్సస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్లతో ఎంత సేవ్ చేయవచ్చు? అల్ట్రా ఫోన్ స్పెసిఫికేషన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Motorola Razr 50 Ultra : మోటోరోలా రేజర్ 50 అల్ట్రాపై భారీ ధర తగ్గింపు.. రూ.99,999 లాంచ్ ధర నుంచి ప్రస్తుతం రూ.63,998కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఎలా పొందాలంటే?

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. డ్రాగన్ ఫ్రూట్ వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పత్రికే..

OnePlus Nord CE 6 Price : వన్ప్లస్ నార్డ్ CE 6 ఫోన్ ఆఫర్ అదిరింది.. ఫ్లిప్కార్ట్లో ఈ వన్ప్లస్ నార్డ్ CE 6 ఫోన్ రూ. 3వేలు తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.

Mahendragiri Varahi First Review: మహేంద్రగిరి వారాహి ఫస్ట్ రివ్యూ

TOP9 ET: డ్రాగన్ కోసం రంగలోకి దిగిన లూగర్..| రాకా కోసం.. ఈ సారి రెమ్యునరేషన్ కాదు.. అంతకు మించి..

Mahendragiri Vaarahi: 'మురారి'కి దీనికి సంబంధం లేదు!
Tomorrow Telugu Movies in TV Channels : గురువారం టీవీలో రానున్న చిత్రాలు.. లిస్ట్లోని మూవీస్ చూశారా?
పైసా ఖర్చు లేకుండా.. చైనాను కట్టడి చేస్తోన్న భారత్.. డ్రాగన్ పెరట్లో ఇండియా ఆట మొదలు..!!

22 నెలల్లో 20 టన్నులు.. కుప్పలు తెప్పలుగా బంగారం కొంటున్న చైనా.. డ్రాగన్ అసలు ప్లాన్ ఇదేనా!
Mahendragiri Varahi: మొహమాటానికి పోయి కొన్ని చెత్త సినిమాలు చేశా.. ఇకపై అలాంటి తప్పు చేయను - సుమంత్
Telugu Movies List in TV: బుధవారం టీవీలో రానున్న చిత్రాలు.. ఈ సినిమాలపై లుక్కేయండి?

Mahendragiri Varahi | సెన్సార్ పూర్తి చేసుకున్న సుమంత్ 'మహేంద్రగిరి వారాహి'.!

బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ (Mary kom) బిగ్బాస్లో అడుగుపెట్టారు.

మహేంద్రగిరి వారాహి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. నటి మీనాక్షి గోస్వామి (Minakshi Goswami)ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుమంత్, ఐశ్వర్య రాజేష్లు నటించిన మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi Pre release event) మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హీరోలు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డలు హాజరు అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా(NTR Bharosa Pension) పథకం కింద నూతన పింఛన్ల మంజూరుకు సన్నాహాలు వేగవంతం చేసింది.

విజయనగరం జిల్లా భోగాపురం(Bhogapuram Incident)లో మానవత్వాన్ని తలదన్నే అత్యంత దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. ఫ్రెష్ లవ్ స్టోరీ: 'రోమాంచకం'లో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.. సుమంత్ ప్రభాస్ కాన్ఫిడెన్స్.!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు.ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవడంతో శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో 'డ్రాగన్' సెట్స్ లో అడుగుపెడతారో లేదో అనే సందేహాలు వచ్చాయి. అయితే మరో రెండు వారాల్లో 'డ్రాగన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మైత్రీ నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు. 'ఇరుముడి' లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ప్లాన్ చేసిన్నట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తామని, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.రెండు వారాల తర్వాత 'డ్రాగన్' షూటింగ్ బిగిన్ అవుతుంది. కంటిన్యూస్ గా షూట్ చేసి, ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే వచ్చే ఏడాది జూన్ లో బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది'' అని రవి శంకర్ పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా లేదా? అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.నిజానికి ఎన్టీఆర్ గాయపడినా 'డ్రాగన్' మూవీ షూటింగుకి బ్రేకులు పడలేదు. హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి, సెప్టెంబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన టాకీ పార్ట్స్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.'డ్రాగన్' సినిమాని

రిటైర్ అయిన తరువాత ఏం చేయాలి? కాలక్షేపం ఎలా? మరీ ముఖ్యంగా డబ్బులు ఎలా మధనపడే వారికి కేరళకు చెందిన రిటైర్డ్ టీచర్ రేమాబాయి జీవితం స్ఫూర్తినిస్తుంది. ఇంతకీ ఆమె చేశారు? తెలుసుకుందాం ఈ కథనంలో. కేరళలోని కొల్లమ్కు చెందిన రేమాబాయి జువాలజీ టీచర్గా,హెడ్మిస్ట్రెస్గా 30 ఏళ్ల పాటు విద్యారంగంలో సేవలందించారు. 2022 మే 31న ఆమె పదవీ విరమణ చేశారు. ఆమె భర్త, ఒక రిటైర్డ్ సీనియర్ బ్యాంక్ మేనేజర్. అలాగే సర్జన్లైన ఆమె కుమారుడు, కోడలు ఢిల్లీలో పనిచేస్తున్నారు. అయితే అదే ఏడాది తల్లి మరణం, ఒంటరితనం వల్ల ఏర్పడిన మానసిక వేదనను జయించడానికి ఆమె తన ఇంటి పెరటి స్థలంలో మొక్కల పెంపకం ప్రారంభించారు. అలా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు. దీని మీద బాగా పరిశోధించి 'మలేషియన్ కింగ్' (Malaysian King) రకానికి చెందిన రెడ్ డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకున్నారు. కేవలం 1,750 చదరపు అడుగుల పెరటి స్థలంలో 90 కాంక్రీట్ స్తంభాలు, పాత టైర్ల సాయంతో 360 మొక్కలతో సాగు ప్రారంభించారు. ప్రారంభంలో 360 మొక్కలు నెలకు రూ. 50వేలకు మించి ఆదాయాన్ని అందించగా,ఆ తరువాత ఆదాయం సుమారు రూ. 1.5 లక్షలకు పెరిగింది. ఈ ఫలితాలు, మరింత భూమి కొనకుండానే తన సాగును విస్తరించడానికి ఆమెను ప్రోత్సహించాయి. ఫలితంగా నెలకు రూ. 4 లక్షలు ఆర్జించేస్థాయికి చేరుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ -మిద్దెతోట మిద్దెపై మట్టిలేని సాగు (Soil-less Cultivation): పెరట్లోనే కాకుండా తన ఇంటి మిద్దెపై (Terrace) బరువు కాకుండా ఉండటానికి మట్టికి బదులుగా ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్, ఆవు పేడను డ్రమ్ములు/బారెళ్లలో నింపి మొక్కలను పెంచడం ప్రారంభించారు. సేంద్రీయ పద్ధదితో ఆమె సక్సెస్ను అందుకోవడం విశేషం. పాత వంటగది వ్యర్థాలు, ఆకులు, కొబ్బరి/పనస వ్యర్థాలు మరియు చేపల వ్యర్థాలతో ఫ్రిష్ అమినో యాసిడ్స్ వంటి 15 రకాల ద్రవ ఎరువులను తయారు చేసి

సుమన్త్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం మహేంద్రగిరి వారాహి విడుదల తేదీ మరియు ప్రీరిలీజ్ ఈవెంట్ వివరాలు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ భక్తిరస మిస్టరీ థ్రిల్లర్ మూవీ ప్రీరిలీజ్ వేడుకను సెప్టెంబర్ 6న అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. అనంతరం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని చిత్ర బృందం స్పష్టం చేసింది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక వినూత్నమైన డివోషనల్ మిస్టరీ కథాంశాన్ని ఎంచుకున్నారు. కథ ప్రకారం 150 ఏళ్ల నాటి ఒక రాజకుటుంబపు శాపం మరియు వారాహి అమ్మవారి శక్తి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. సుమన్త్ ఇందులో ఒక నమ్మకం లేని ఇన్వెస్టిగేటర్ మరియు ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపిస్తూ ఈ శాపం వెనుక ఉన్న రహస్యాలను చేధించడానికి ప్రయత్నిస్తారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ పతాకాలపై మధు కలిపు మరియు లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని ప్రధాన తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వారాహి మాత పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి గోస్వామి మరియు మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో పాటు హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన మెరుపు పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మరియు రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే చాలా భిన్నంగా మరియు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. చిత్ర యూనిట్ ఆలయ సందర్శనలు చేయడం మరియు థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫలితంగా ట్రైలర్ హైప్ మరియు వినూత్న ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ

Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’

Poco X8 Power Series Leaks: త్వరలోనే మార్కెట్లోకి పోకో X8 ప్రో పవర్ సిరీస్ మోడల్స్ విడుదల కాబోతున్నాయి. ఇది ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Poco X8 Power Series Leaks: మార్కెట్లోకి పోకో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ఫోన్స్ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదల చేసిన మంచి స్మార్ట్ఫోన్స్ మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ కంపెనీ కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే పోకో నుంచి X సిరీస్ స్మార్ట్ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ పోకో ఎక్స్8 పవర్ సిరీస్తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్లో భాగంగా రెండు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో పోకో ఎక్స్ 8 పవర్ ప్రో 5Gతో పాటు పోకో ఎక్స్8 పవర్ ప్రో మాక్స్ 5G వంటి మోడల్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్ను కూడా కలిగి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. ఇందులో భాగంగా హై ఎండ్ మోడల్ మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. పోకో ఎక్స్8 పవర్ మోడల్కు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. టిప్స్టర్ సంజు చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ చాలా అద్భుతమైన 6.83-అంగుళాల 1.5K డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది AMOLED ప్యానెల్ను కలిగి రాబోతోంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇక ఈ పోకో ఎక్స్8 పవర్ ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇది క్వాల్కామ్

Name: Columnar Cactus శాస్త్రీయ నామం: సెరెస్ ప్టెరొ గోనస్ Scientific Name: Cereus pterogonus Lem Synonym (s) : Cereus repandus (L.) Mill. కుటుంబం: క్యాక్టేసి Family: Cactaceae కోలజెమ్మెడు పండును వేర్వేరు భాషల్లో ఏమని పిలుస్తారంటే.. ఇంగ్లీష్: సెంటి నేల్ క్యాక్టస్, డాగ్ టేల్ క్యాక్టస్, హెడ్జ్ క్యాక్టస్ తమిళం: సిప్పాల్ కథలై; మలయాళం: పుచ్చముళ్ళు; బెంగాలీ: మానస తెలుగు: కోలజెమ్మెడు, జెమ్మడు, నిటారు జెమ్మెడు. వేరే భాషల్లో దీనికి గుర్తింపు తక్కువ. గ్రామాల్లో ఉండే జెమ్మెడు రకాలలో కోలజెమ్మెడు ఒకటి. ఊర్లలో చాలామందికి తెలిసిన చెట్టు. ఈ జెమ్మెడులో కూడా డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా మే నుంచి నవంబర్ మాసం వరకు అంచెలంచెలుగా పూత–కాత వస్తుంది. దీన్ని నైట్ బ్లూమింగ్ సెరెస్ అని కూడ అంటారు. దీనిలో దాదాపు 33 జాతులు ఉన్నాయని అంచనా. ఉనికి: ఇవి మెట్ట ప్రాంత మైదానాలు, అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి. నిటారుగా గుంపులుగా పెరుగుతాయి. దాదాపు 3–6 మీటర్ల ఎత్తువరకు పెరగగలవు. వీటికి కణుపులు ఉంటాయి. వీటి ఉనికి ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండలపు ప్రాంతాల్లో ఉంది. దీనికి డ్రాగన్ పండు చెట్టుకు అతిదగ్గరి పోలిక ఉంది. దీనికి ముళ్లతో కూడుకున్న ఆరు నుంచి ఎనిమిది భుజాలు ఉంటాయి. వీటి స్వస్థలం, బ్రెజిల్, ఊరుగామ్, అర్జెంటీనా. వీటి ఉనికి దక్షిణ అమెరికా, ఇండియా, చైనా, శ్రీలంక, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా ఉంది. ఇండియాలో చాలా రాష్ట్రాలలో వీటి ఉనికి ఉంది. నల్లమల అడవులతో ΄ాటు మైదానపు ప్రాంతాలు, పొలం గట్లు తదితర చోట్ల పెరుగుతుంది. ఈ చెట్లు వాతావరణ మార్పులను తట్టుకోగలవు. పోషక ఔషధ నిధులు కోలజెమ్మెడు చెట్లను పొలం చుట్టూ జీవ కంచెగా పెంచుతారు. వీటిని అందం కోసం కుండీలలో పెంచుకోవచ్చు. పండ్లను తింటారు, చప్పటి రుచి ఉంటాయి. కాని నల్లమల అడవుల్లో ఈ పండ్లను జనం తినరు

డ్రాగన్ ఫ్రూట్ పేరు చెబితేనే ఎంతో మందికి నోరూరిపోతుంది. ఈ పడులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటి కోసమే ఎంతో మంది డ్రాగన్ ఫ్రూట్స్ తింటూ ఉంటారు. ఇది ఎన్నో అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది. కానీ ఇదే పండును అతిగా తింటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కొంతమందికి అలర్జీని ఇస్తుంది. అలాంటివాళ్లు దీన్ని పూర్తిగా తినకపోవడమే మంచిది. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది, కానీ ఈ పండు తిన్న తర్వాత దురద, చర్మంపై దద్దుర్లు, పెదాలు లేదా నాలుక వాపు, వాంతులు వంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తే ఈ పండుకు దూరంగా ఉండడమే మంచిది. డ్రాగన్ ఫ్రూట్ తిన్నతరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు డ్రాగన్ ఫ్రూట్ తినే పరిమాణంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ తిన్న తరువాత రక్తంలోని చక్కెర స్థాయులు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా, డయాబెటిస్ తగ్గించే మందులు లేదా ఇన్సులిన్ వాడేవాళ్లు దీన్ని ఎక్కువగా తింటే, రక్తంలో చక్కెర స్థాయులు బాగా పడిపోయే ప్రమాదం ఉంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలోని పొటాషియం స్థాయులను నియంత్రించడం కష్టమవుతుంది. అందుకే, పండ్లలోని పొటాషియం పరిమాణం చాలా ముఖ్యం. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లు డ్రాగన్ ఫ్రూట్ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కిడ్నీ వ్యాధి దశ, రక్తంలో పొటాషియం స్థాయి, వాడుతున్న మందుల ఆధారంగా ఎంత పరిమాణంలో తినాలో డాక్టరే నిర్ణయించాలి. ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది సాధారణంగా సురక్షితమైన పండు. కానీ, అలర్జీలు ఉన్నవాళ్లు దీన్ని పూర్తిగా తినకూడదు. డయాబెటిస్, కిడ్నీ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, దీన్ని ఎంత మోతాదులో తినవచ్చో డాక్టర్తో మాట్లాడి తెలుసుకోవాలి

నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ‘బఘీరా’ అనే శునకం మృతి చెందడంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బఘీరాతో తమకున్న నాలుగేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “బఘీరా.. నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు. కానీ, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి, ఓదార్పుతో నా రోజులను నింపావు. నీవు లేని లోటు మాటల్లో చెప్పలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది. కానీ, నువ్వు పంచిన ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. నన్ను నీ తోడుగా ఎంచుకున్నందుకు, నా పక్కన నడిచినందుకు, ఈ నాలుగేళ్లను మరింత అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం” అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. బఘీరాతో దిగిన ఫొటోలతో పాటు, దాని జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటిన చిత్రాన్ని ఆయన పంచుకున్నారు. మరోవైపు, ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆసుపత్రి వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఇటీవల ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో భుజానికి గాయమవడంతో, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఆగస్టు 13న డిశ్చార్జ్ అయిన తారక్, ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్ తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది! ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?

Tondavada: తొండవాడ అగస్త్యేశ్వర ఆలయంలో గోశాల, అన్నదాన భవనాలకు భూమిపూజ! Tondavada: అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో గోశాల, అన్నదాన భవనాలకు భూమిపూజ ఉదయం 3:30 గంటలకు గోశాల నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి వేద పండితుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు అన్నదాన భవన నిర్మాణానికి వేద పండితుల ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి శ్రీ అగస్త్య మహాముని–లోపముద్ర దేవి ఆలయంలో మండల పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డితో పాటు తొండవాడ గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో గోశాల, అన్నదాన భవన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కావడం పట్ల భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భగీర కన్నుమూసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భగీర కన్నుమూసింది. ఈ చేదు వార్తను తట్టుకోలేకపోయిన ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా తన పెట్ డాగ్ను గుర్తుచేసుకుంటూ ఎంతో హృదయవిదారకమైన పోస్ట్ షేర్ చేశాడు. నాలుగేళ్ల పాటు తన జీవితంలో భాగమై ఎనలేని సంతోషాన్ని, అనుబంధాన్ని పంచిన భగీర ఇక లేడనే విషయాన్ని ఆయన అత్యంత తీవ్రమైన భావోద్వేగంతో వ్యక్తపరిచాడు. ఎన్టీఆర్.. భగీరని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.. "నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు. ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు నా హృదయాల్లో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నన్ను ఎంచుకుని, నాతో పాటు నడిచి ఈ నాలుగేళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చినందుకు చాలా థ్యాంక్స్ భగీర. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ రాసుకొచ్చాడు.ఎన్టీఆర్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జంతువులపై ఎన్టీఆర్ చూపించే ప్రేమను, ఆ జంతువుతో ఆయనకున్న గాఢమైన అనుబంధాన్ని చూసి అభిమానులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పూర్తి అయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మొదటి నుంచి

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. NTR Health Update: ఎన్.టి.ఆర్. అభిమానులను కొంతకాలంగా ఆందోళనకు గురిచేస్తున్న ఆయన భుజం గాయంపై తాజాగా స్పష్టత వచ్చింది. షూటింగ్ సమయంలో కుడి భుజానికి గాయం కావడంతో తారక్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ, కోలుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తారక్కు అందించిన చికిత్స, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. కుడి భుజం జాయింట్ ప్రాంతంలో గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తారక్ ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తారక్ రికవరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, వైద్యుల సూచనలను పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన అంకితభావాన్ని చూస్తుంటే త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాత సుమారు రెండు నెలల్లో షూటింగ్లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళన కొంత తగ్గింది. తారక్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తారక్ నటిస్తున్న డ్రాగన్ సినిమాపై కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ‘డ్రాగన్’కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Poco M8x 5g Price: ఎప్పటినుంచో మంచి కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కొన్ని రోజుల తరబడి బ్యాకప్ బ్యాటరీని ఇచ్చే ఫోన్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్తో పాటు హెవీ బ్యాటరీ సెటప్తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ Poco M8x 5G స్మార్ట్ఫోన్ పేరుతో లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7900mAh భారీ బ్యాటరీ.. ఈ ఫోన్లో అత్యంత ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీగా భావించవచ్చు.. మార్కెట్లోకి విడుదల కాబోయే ఈ Poco M8x 5G మోడల్ ఏకంగా 7900mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గంటల తరబడి గేమింగ్ ఆడినా, సినిమాలు చూసినా, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసినా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం ఉండదని త్వరలోనే కంపెనీ క్లైమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. అద్భుతమైన డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్.. ఈ Poco M8x 5G మొబైల్లో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 5 (Snapdragon 4 Gen 5 - 4nm) ప్రాసెసర్ను

మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, దీని తర్వాత ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీడెడ్, ఆంధ్రా బాక్సాఫీస్ వద్ద మాస్ రికార్డులను తిరగరాసిన ఆ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ సారి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాను కేవలం ఫ్యామిలీ లేదా రొటీన్ మాస్ ఎలిమెంట్స్ తో కాకుండా సోషియో-ఫాంటసీ, పౌరాణిక కలయికతో లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంలో కుమారస్వామిగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ కాకుండా మరో టైటిల్ ని కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కోసం గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ తో పాటు దేవసేనాపతి అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ను ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేయడం విపరీతమైన చర్చకు దారితీసింది. గాడ్ ఆఫ్ వార్ వైరల్ అయినా కూడా దేవసేనాపతి టైటిల్ చాలా బావుందని, దాన్ని ఫైనల్ చేయమని

విక్టరీ వెంకటేష్(venkatesh)తో ఆదర్శ కుటుంబం(Aadarsa Kutumbam) సినిమాను తెరకెక్కిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas).. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ పూర్తిగా ఎన్టీఆర్(NTR)తో చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టాల్సి ఉంది. డ్రాగన్(Dragon) షూటింగ్లో ఎన్టీఆర్కు గాయమైన నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, 2027 జూన్లోనే రిలీజ్ చేయాలనే టార్గెట్తో టీమ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ రిలీజ్ వరకు ఎన్టీఆర్ అదే లుక్ను కొనసాగిస్తూ ప్రమోషన్స్లోనూ పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో జూన్ 2027 వరకు ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్ట్కు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కొత్త లుక్లోకి మారేందుకు కూడా ఎన్టీఆర్కు కొన్ని వారాల టైమ్ అవసరమవుతుంది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ మరో సినిమాను త్వరగా పూర్తి చేస్తారా? అనే డిస్కషన్ మొదలైంది. అయితే పదినెలల్లో ఓ ప్రాజెక్ట్ను పూర్తి చేసే డైరెక్టర్ గా త్రివిక్రమ్కు ట్రాక్ రికార్డ్ లేదు. అందుకే ఎన్టీఆర్ రాక కోసం వేచి చూస్తూనే, ఈలోపు మైథలాజికల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను మరింత పక్కాగా పూర్తి చేయడమే త్రివిక్రమ్ ప్లాన్గా కనిపిస్తోంది. కథ, క్యారెక్టర్ డిజైన్, భారీ సెట్స్, విజువల్ ట్రీట్మెంట్ వంటి అంశాలపై ఆయన ఎక్కువ టైమ్ కేటాయించే అవకాశముంది. గాడ్ ఆఫ్ వార్(God Of War) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika Haasinee Creations) బ్యానర్ నిర్మించనుంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ భారీ సినిమా కోసం ఈ వెయిటింగ్ పీరియడ్ కీలకంగా మారనుంది

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై ఆయన చేసే వ్యాఖ్యలు, నిర్వహించే పూజలు తరచూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైరల్ అవుతుంటాయి. కొందరు ఆయన జోస్యాలను తీవ్రంగా విమర్శిస్తే, మరికొందరు ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ భవిష్యత్తు, ఆయన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి సారించాడు. అయితే ఆయన మళ్లీ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడు? టీడీపీ బాధ్యతలు తీసుకుంటాడా లేదా? అనే అంశంపై నందమూరి అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఎల్లప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు సంబంధించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. 'జూనియర్ ఎన్టీఆర్ అసలైన పుట్టినరోజు వేరు, ఆయన బయట ప్రపంచానికి కనిపించేలా జరుపుకునే పుట్టినరోజు వేరు. ఆయన ఒరిజినల్ బర్త్డే డేట్ నా ఒక్కడికే తెలుసు. ఎన్టీఆర్ కచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడు, కానీ ఇప్పట్లో మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదు. 2030 సంవత్సరం వరకు రాజకీయాల్లోకి రావద్దని నేనే స్వయంగా ఆయనకు చెప్పాను' అంటూ బాంబు పేల్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అసలు పుట్టినరోజు, 2030 పొలిటికల్ ఎంట్రీపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం వేయించిన ప్రత్యేకమైన భారీ సెట్ వర్క్, దాని డీటైలింగ్ చూసి యూనిట్ సభ్యులంతా ఫిదా అయ్యారట. డ్రాగన్ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రశాంత్ నీల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ సెట్లు, హై-వోల్టేజ్ యాక్షన్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించిన ఒక ప్రత్యేకమైన భారీ సెట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సినిమాలోని కీలకమైన సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్, యూరోపియన్ స్టైల్ డిజైన్స్తో ఒక వింటేజ్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేశారు. షూటింగ్ సమయంలో సెట్లోకి అడుగుపెట్టిన నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రొడక్షన్ డీటైలింగ్, ఆర్ట్ వర్క్ చూసి ఫిదా అయిపోయారట. ప్రశాంత్ నీల్ విజన్ను నిజం చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పర్ఫెక్ట్గా రీ-క్రియేట్ చేసింది. సాధారణంగా కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలలో డార్క్ మోనోక్రోమటిక్ షేడ్స్ను ఎక్కువగా వాడిన ప్రశాంత్ నీల్, ఈసారి డ్రాగన్ కోసం పూర్తి డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఈ భారీ సెట్లోనే ఎన్టీఆర్ పై తీసే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో రచ్చ లేపుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ రా అండ్ రగ్గడ్ లుక్, దానికి తోడు ఈ విజువల్ గ్రాండియర్ వెండితెరపై ఒక విజువల్ వండర్ కాబోతోంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లేని

టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్తో పాటు కమర్షియల్ సక్సెస్ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ రూటే వేరు. టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్తో పాటు కమర్షియల్ సక్సెస్ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూటే వేరు. ‘శ్రీమంతుడు’తో జర్నీ స్టార్ట్ చేసిన ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్.. ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘ఉప్పెన’, పాన్ ఇండియా రేంజ్లో ‘పుష్ప’ ప్రాంచైజీలతో పాటు దాదాపు 25కు పైగా చిత్రాలతో ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్మార్క్ సెట్ చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సత్తా చాటుతున్న మైత్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక భారీ ప్లాన్తో సరికొత్త లైనప్ను సిద్ధం చేసింది. సాధారణంగా ఒకే సంస్థ ప్రెజెంట్ ట్రెండ్ను బేస్ చేసుకుని సినిమాలు ప్లాన్ చేయడం చూస్తుంటాం. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రాబోయే ప్రాజెక్టుల కోసం వేర్వేరు చారిత్రక కాలాలను ఎంచుకుంటోంది. కాలాన్ని రీక్రియేట్ చేస్తూ వెండితెరపై వింటేజ్ అనుభూతిని పంచే పీరియడ్ జోనర్పై పూర్తి దృష్టి పెట్టింది. ఒకే సమయంలో, వేర్వేరు టైమ్లైన్లలో నడిచే భారీ ప్రాజెక్టులను ఒకే బ్యానర్లో హ్యాండిల్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో రానున్న ‘రణబాలి’ (Ranabaali). ఈ కథ 19వ శతాబ్దపు రాయలసీమ నేలల్లోకి తీసుకెళ్లనుంది. ఆ నాటి జీవన విధానం, స్థానిక పోరాటాలు, ఆచారాలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు డైరెక్టర్ ఏకంగా రెండున్నరేళ్లు లోతైన పరిశోధన చేశారు. నాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఒక పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఇక పాన్

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాల్లోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంబంధిత అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగించాలని, అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీని మరింత పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకోసం రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు కనిపించిన వెంటనే సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో హనుమాన్ బృందాలను మోహరించి ఏనుగుల కదలికలను పర్యవేక్షించాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఏనుగులను రెచ్చగొట్టకుండా, వాటికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. చంద్రగిరి పరిసర గ్రామాల్లో ఏనుగుల సంచారంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. అటవీ సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏనుగులు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి అధికారులకు సమాచారం అందించాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని ‘నిబంధనల ప్రకారమే జగన్ను ములాఖత్కు అనుమతించాం’ తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం