Oneindia Telugu•General•21 ఆగ
పసిడి చీరెలో దర్శనం ఇచ్చిన పద్మావతి అమ్మవారు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం అత్యంత వైభవంగా పూర్తయింది. ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన ఈ పవిత్ర వేడుకల్లో వేలాదిమంది భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఈ వేకువజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు అర్చకులు. సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి తదితర సుగంధ, సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించారు. తొమ్మిది గ్రంథులతో అమ్మవారిని అలంకరించి, ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు ప్రతీకగా పూజించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను సమర్పించి మహా మంగళహారతితో వ్రతాన్ని ముగించారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని అర్చకులు పేర్కొన్నారు.శ్రావణంలో దానం చేయదగ్గ వస్తువులు.. ఓ దోసెడు పోసినా చాలుకాగా.. ఆలయానికి తరలివచ్చిన అశేష భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుమారు మూడు టన్నుల పుష్పాలు, 14 రకాల 30,000 కట్ ఫ్లవర్స్తో ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, మొసంబి, పైనాపిల్ తదితర పండ్లు, వివిధ రకాల పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం పైభాగంలో గజలక్ష్మి