© 2026 nimisham.in

భారతీయ జీవిత బీమా సంస్థ-ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆవిష్కరించింది. 'బీమా ప్లాటినం', 'జీవన్ రక్ష' పేర్లతో వస్తున్న ఈ పాలసీలు 2026 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. పొదుపుతో పాటు రక్షణను కోరుకునే వారి కోసం ఒక ప్లాన్ను, పూర్తిస్థాయి ఆర్థిక భద్రత కోసం మరో టర్మ్ ప్లాన్ను ఎల్ఐసీ ప్రవేశపెట్టింది.ఎల్ఐసీ బీమా ప్లాటినంఇది పొదుపు, బీమా రక్షణ రెండింటినీ అందించే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇందులో గ్యారెంటీడ్ రిటర్న్స్ ప్రధాన ఆకర్షణ. ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ. 1,000 హామీ మొత్తానికి రూ. 70 చొప్పున 'గ్యారెంటీడ్ అడిషన్' లభిస్తాయి. కనీస హామీ మొత్తం రూ. 3 లక్షలు కాగా, గరిష్ఠ పరిమితి లేదు. మెచ్యూరిటీ సమయంలో హామీ మొత్తంతో పాటు అప్పటివరకు జమయిన గ్యారెంటీడ్ అడిషన్లు పాలసీదారుకు అందుతాయి. ఇప్పటికే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి రిబేటు, లోన్ సౌకర్యం, అదనపు రైడర్లను జోడించుకునే వెసులుబాటు వంటి సదుపాయులు ఇందులో ఉన్నాయి.ఎల్ఐసీ జీవన్ రక్ష ఇది కుటుంబ ఆర్థిక భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్యూర్ రిస్క్ (టర్మ్) ప్లాన్. పాలసీదారుడికి ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎదురైనప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాన్లో కనీస హామీ మొత్తం రూ. 5 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ. 24 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంది. ఇందులో సింగిల్, రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం