
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వారణాసిలో నిర్వహించనున్న వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించనున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.





