
Garuda Purana Telugu: మరణం అనేది జీవితంలో తప్పించుకోలేని వాస్తవం. అయితే మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? ఆత్మ వెంటనే మరో లోకానికి వెళ్తుందా? కొంతకాలం తన కుటుంబం, ఇంటి చుట్టూనే ఉంటుందా? మరణానంతర ఆత్మ ప్రయాణం గురించి హిందూ ధార్మిక గ్రంథమైన ‘గరుడ పురాణం’లో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణం వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ గ్రంథంగా పరిగణించబడుతుంది. శ్రీమహావిష్ణువు, గరుడుడి మధ్య జరిగిన సంభాషణ రూపంలో జీవితం, మరణం, కర్మ, పాపం-పుణ్యం, మరణానంతర ప్రయాణం వంటి అంశాలను ఇందులో వివరించినట్లు చెబుతారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి గతిని నిర్ణయించడంలో కర్మలకు కీలక పాత్ర ఉంటుందని ధార్మిక విశ్వాసం.





