
ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ మరోసారి ప్రకటించింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) 2026కి సంబంధించిన మోస్ట్ వాంటెడ్ హై ప్రొఫైల్ టెర్రరిస్టుల ‘రెడ్ బుక్’ను విడుదల చేసింది. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరును పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొంది. అంతేకాదు అతడిని పట్టుకునేందుకు ప్రకటించిన రివార్డును 70 లక్షల పాకిస్తానీ రూపాయలకు పెంచినట్లు ప్రకటించింది. FIA అధికారిక వెబ్సైట్లోనూ 2026 రెడ్ బుక్ విడుదలైనట్లు పేర్కొంది.





