
దేశమంతటా వినాయక చవితి పండగ వాతావరణం సంతరించుకుంది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ బొజ్జ గణపయ్యను తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మన టాలీవుడ్ ప్రముఖులు కూడా తమ నివాసాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పండగను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ , ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి తమ కుమారుడు వాయువ్ తేజ్తో కలిసి నివాసంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన ఈ దంపతులు, తమ పూజా విశేషాలను సోషల్ మీడియాలో పంచుకోగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.



