
Andhra Pradesj BPCL Refinery Project With Rs 1.45 Lakh Crores: ఆంధ్రప్రదేశ్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. బీపీసీఎల్ సీఎండీ సంజయ్ ఖన్నా, ఇతర అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్పై చర్చించగా.. ఈ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం 75శాతం భూములు అప్పగించామన్నారు. వచ్చే నెలలో మిగిలిన భూమిని అప్పగిస్తామన్నారు. బీపీసీఎల్ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని సంస్థ సీఎండీ సీఎంకు తెలిపారు.





