
Gudivada Amarnath : ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మంగళగిరిలోని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదు. మూడోసారి సమన్లు జారీ చేయడంతో అమర్ నాథ్ విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు, వ్యవస్థల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా విచారణకు వచ్చానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు కేవలం రాజకీయ సెటైర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలను అవమానించే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారు. అలాగే, కూటమి ప్రభుత్వం, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ విమర్శ మాత్రమే : మహిళా కమిషన్ విచారణలో ‘మేకప్ మంత్రి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరారని అమర్నాథ్ తెలిపారు. తాను మహిళా లోకాన్ని అవమానించలేదన్నారు. రాజకీయ విమర్శలో భాగంగానే ఆ వ్యాఖ్య చేశానని చెప్పినట్లు వెల్లడించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి టీడీపీ ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం నడిపిందని తీవ్రంగా ఆరోపించారు. అలాగే ‘మీరు చేసే జాబ్స్ మా వాళ్లు చేయలేరు’ అన్న వ్యాఖ్యలపైనా కూడా కమిషన్ వివరణ అడిగిందన్నారు. ఆ మాటలు వేరే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరైనా ఆ వ్యాఖ్యలను తమకు నచ్చిన విధంగా అర్థం చేసుకుంటే దానికి తాను బాధ్యుడు కాదని కమిషన్కు వివరించినట్లు చెప్పారు. హోంమంత్రి అనిత తన శాఖ పనులపై దృష్టి పెట్టకుండా ఇతర అంశాలపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారనే రాజకీయ వ్యాఖ్య మాత్రమే చేసినట్టు తెలిపారు. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనని చెప్పా : విచారణ సందర్భంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అని కమిషన్ ప్రశ్నించిందని, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని చెప్పినట్లు అమర్నాథ్ చెప్పారు. తాను ఎవరినీ కించపరిచేలా







.webp)