
Janasena : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ యావత్ తెలుగు సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారసత్వమే జనసేన పార్టీకి అసలైన స్ఫూర్తి అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ నడుస్తున్న తీరుకు దాశరథి జీవితమే ఒక దిక్సూచి అని పేర్కొంది. ఆయన కేవలం విప్లవ కవి మాత్రమే కాదని, వేదాలను కూలంకషంగా చదివి, భక్తిని, సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న గొప్ప జ్ఞాని అని జనసేన కొనియాడింది. సమాజంలో మార్పు కోసం ఒకవైపు విప్లవ భావాలను రగిలిస్తూనే, మరోవైపు మన మూలాలైన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవించడం ఎలాగో దాశరథి జీవితం ద్వారా స్పష్టమవుతోందని, అదే బాటలో జనసేన ప్రయాణిస్తోందని స్పష్టం చేసింది. Read Also : ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి తుమ్మల స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ జనసేన పార్టీ కేవలం ఒకే రకమైన సిద్ధాంతానికి పరిమితం కాకుండా, అటు సాంప్రదాయాన్ని, ఇటు ప్రగతిశీల మార్పును సమపాళ్లలో మిళితం చేస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు సమాజంలో అణచివేతకు, అన్యాయాలకు గురవుతున్న ప్రజా సమస్యలపై రాజీలేని విప్లవాత్మక పోరాటం చేస్తూనే.. మరోవైపు భారతీయ మూల స్తంభమైన సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ట్విట్టర్ (X) వేదికగా చాటిచెప్పింది. ఆధునిక రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని రక్షించడం మరియు ప్రజా పక్షాన నిలబడి విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగడమే తమ పార్టీ యొక్క అంతిమ విధానమని జనసేన క్యాడర్ ఉద్ఘాటించింది. Supriya Sule: కాంగ్రెస్లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు
%20(3).webp)










