వెనెజువెలా జంట భూకంపాలు.. భారత్ లో పెట్రోల్
Actor ProfilePolitician

వెనెజువెలా జంట భూకంపాలు.. భారత్ లో పెట్రోల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెనెజువెలా జంట భూకంపాలు.. భారత్ లో పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతాయా
Eenadu25 Jul 2026
వెనెజువెలా జంట భూకంపాలు.. భారత్ లో పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతాయా

ఇంటర్నెట్‌ డెస్క్‌: శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తుతో వెనెజువెలా దేశం అల్లకల్లోలంగా మారింది. వెనువెంటనే రెండు భారీ భూకంపాలు (Venezuela Earthquake) విరుచుకుపడటంతో ఎటు చూసినా ధ్వంసమైన భవంతులు.. శిథిలాల దిబ్బలే కన్పిస్తున్నాయి. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన వెనెజువెలాలో సంభవించిన ఈ విలయంతో ఇప్పుడు చమురు సరఫరా (Oil Supply)పై ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా దిగుమతులపై అత్యధికంగా ఆధారపడే భారత్‌ లాంటి దేశాలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది..? దీని వల్ల మన దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతాయా? తెలుసుకుందాం..! రాజధాని కారకస్‌ సహా వెనెజువెలా వ్యాప్తంగా పలు నగరాలను ఈ భారీ భూకంపాలు వణికించాయి. అయితే, ఇప్పటివరకు చమురు మౌలిక సదుపాయాల పరిస్థితిపై స్పష్టత లేదు. రిఫైనరీలు, ఎక్స్‌పోర్ట్ టెర్మినళ్లు, పైప్‌లైన్లకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే దానిపై అధికారిక సమాచారం ఏదీ రాలేదు. భూకంపం కారణంగా చమురు క్షేత్రాలు దెబ్బతినలేదని కొన్ని అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. చమురు ఉత్పత్తికి ఇప్పటివరకు అంతరాయం కలగలేదని తెలిపాయి. అయితే, విపత్తు కారణంగా విద్యుత్‌కు అంతరాయం కలగడం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వెనెజువెలాకు ప్రధాన కార్గో గేట్‌వే అయినా ‘లా గువేరా’ నగరం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని డిజాస్టర్‌ జోన్‌గా ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చమురు లోడింగ్‌ ఆలస్యం, రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం వంటివి ట్రేడర్లు, రిఫైనర్లు, బీమా సంస్థలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు దిగుమతుల కోసం భారత్‌ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లను (Oil Imports) భారీగా పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం నుంచి సగటు