
NEET పరీక్షకు కొన్ని గంటల ముందు హైదరాబాద్లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే NEET పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని మియాపూర్లో మృతి చెందడం కలకలం రేపింది. బాధితురాలు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల అంచనాలను అందుకోలేకపోతున్నాననే ఆందోళనతో పాటు పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని విద్యార్థిని ఓ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆమె ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఇటీవల NEET పరీక్ష కోసం తీవ్రంగా సన్నద్ధమవుతున్నట్లు, పరీక్ష ఫలితాలపై ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి, మానసిక ఆరోగ్యంపై చర్చకు దారితీసింది. నిపుణులు మాత్రం పరీక్షలు జీవితంలో ఒక భాగమే తప్ప అంతిమ గమ్యం కాదని, విద్యార్థులపై అధిక అంచనాలు, నిరంతర ఒత్తిడి మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు.విద్యార్థులు పరీక్షల కారణంగా ఒత్తిడికి గురైతే కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో తమ భావాలను పంచుకోవాలని, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదని, విద్యార్థులకు కుటుంబ సభ్యులు నిరంతరం భావోద్వేగపరమైన అండగా నిలవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. మరోవైపు నీట్ పరీక్షలో గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పటిష్ఠ చర్యలు చేపట్టింది.విద్యార్థులకు ముఖ్య సూచనలు..పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:15 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన