
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Petrol Diesel Price News: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. వ్యూహాత్మక సముద్ర మార్గమైన 'హోర్ముజ్ జలసంధి'ని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా తిరిగి తెరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆదివారం రాత్రి బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం తగ్గి బ్యారెల్కు 84 డాలర్లకు పడిపోగా, యూఎస్ క్రూడ్ 4.8 శాతం మేర తగ్గి దాదాపు 81 డాలర్లకు చేరింది. గడిచిన మార్చి నెల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం? ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో అత్యధిక భాగం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఈ మార్గాన్ని మూసివేశారు. ఈ దిగ్బంధనం కారణంగా వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం లేదా సురక్షిత ప్రయాణం కోసం సగటున 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 కోట్లకు పైగా) అదనపు భారాన్ని భరించాల్సి వచ్చింది. ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగి ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లను దాటేసేవని
