
బ్రిటన్, కెనడాలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు సంబంధించి భారత గూఢచార సంస్థలు తీవ్ర హెచ్చరిక జారీ చేశాయి. గూఢఛార నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఇండియాకు, ప్రధాని మోదీకి అనుకూలంగా వ్యవహరించే వారిపై దాడులకు కుట్ర పన్నుతున్నాయి. నిఘా వర్గాల ప్రకారం.. ఇటీవల కాలంలో బ్రిటన్, కెనడాలోని భారతీయులపై విద్వేష నేరాలు, హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఈ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చెదురుముదురుగా జరిగేవి.. కానీ ఇప్పుడు అవి మరి వ్యవస్థీకృతంగా మారవచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ దాడులను అడ్డుకునేందుకు భారత భద్రతా సంస్థలు ఆ దేశాల భద్రతా సంస్థలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి.నిఘా అధికారులు ఏమంటున్నారంటే? ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే ఐఎస్ఐ.. బ్రిటన్, కెనడాలోని భారతీయులపై దాడులు చేసేందుకు కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ఐరోపాలో పనిచేస్తున్న తన నెట్వర్క్ కు ఆదేశాలు జారీ చేసిందని ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి వెల్లడించారు. ఆ అధికారి ప్రకారం.. ఈ ఘటనలు ఒక ప్లాన్ లో భాగంగా జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ భారతీయలపై వరుస సమన్వయ దాడులకు ప్రణాళిక రచిస్తోంది. ఈ శక్తులు భారత్ కు అనుకూలంగా వ్యవహరించేవారిని లేదా ప్రధాని మోదీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకోవచ్చు. దీనిని ఒక సాకుగా ఉపయోగించుకుని ఇలాంటి దాడులు చేయవచ్చు. అని ఆ అధికారి పేర్కొన్నారు. ఆ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకోకపోవడం పట్ల కలిగిన నిరాశ ఫలితంగానే ఐఎస్ఐ వ్యూహంలో ఈ మార్పు వచ్చింది. లక్ష్యం కేవలం భారతీయులు మాత్రమే కాదని.. ఖలిస్తాన్ సంబంధిత కేసులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటున్న భారతీయ ఏజెన్సీలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.ఖలిస్తాన్ కు లభించని మద్దతు.. నిరాశలో పాక్ నిఘా సంస్థ హింసాత్మక దాడులు చేయడానికి ఐఎస్ఐ తన గ్యాంగ్స్టర్ నెట్వర్క్ను ఉపయోగించుకోవచ్చని































.webp)














