Bengaluru Byadarahalli Woman Murder : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బ్యాదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 22 ఏళ్ల యువతి తన అద్దె ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె ప్రియుడిని ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అతడు కూడా.. సదరు యువతి మృతదేహం పక్కనే స్పృహ తప్పిన స్థితిలో పడి ఉండగా.. పోలీసులే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే అమ్మాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. వీరికి ఏమైందనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం. పెళ్లి సంబంధం కుదర్చడమే కారణమా?హతురాలిని మగాడి మెయిన్ రోడ్డు సమీపంలోని తులసి నగర్లో నివసిస్తున్న 22 ఏళ్ల ఎస్ భవానిగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రస్తుతం చదువుకుంటూనే.. ఒక మొబైల్ షోరూమ్లో బిల్లింగ్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తోంది. అయితే భవాని తండ్రి శ్రీనివాస్ వృత్తిరీత్యా వంట మాస్టర్ కాగా.. కుమార్తె హత్య విషయం తెలుసుకుని పోలీసులకు సంచలన ఫిర్యాదు చేశారు. తన కుమార్తె భవాని, చంద్రశేఖర్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఇటీవలే తమకు తెలిసిందని చెప్పారు. అయితే తాను కూతురి ప్రేమను నిరాకరించి.. ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుని సంబంధాలు చూడడం ప్రారంభించినట్లు వివరించారు. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం తమ కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో భవాని, చంద్ర శేఖర్లకు సంబంధించిన ఒక ఫోటో షేర్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. దీన్ని చూసి ఆందోళన చెందిన తాను.. కుమార్తెకు భవానికి ఫోన్ చేశానని.. కానీ అప్పటికే ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చిందని పోలీసులకు వివరించారు."నీ కూతురిని చంపేశా".. తండ్రికి నిందితుడి ఫోన్!అయితే కూతురి ఫోన్ కలవకపోవడంతో.. శ్రీనివాస్ నేరుగా నిందితుడైన చంద్రశేఖర్కు ఫోన్ చేశారు. మొదట కాల్స్ ఎత్తని నిందితుడు.. ఆ తర్వాత తిరిగి భవాని తండ్రికి
Actor ProfilePolitician
తండ్రికి ఫోన్ చేసి ప్రియుడి ఘాతుకం
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
తండ్రికి ఫోన్ చేసి ప్రియుడి ఘాతుకం, రక్తపు మడుగులో యువతి