
Elon Musk : భారతదేశంలోనే కాదు యూరప్ తోసహా అనేక దేశాల్లో కాక్రోచ్ పుట్టలను సృష్టించిన చరిత్ర ఎలాన్ మస్క్. పారిస్ నుంచి ఢిల్లీ వరకూ, బ్రస్సెల్స్ నుంచి మలేషియా వరకూ అన్నిదేశాలూ మస్క్ వల్ల ఎదోరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అనేక దేశాలు మస్క్ ఆన్లైన్ ఫ్లాట్ ఫాంలను నిషేధించాయి. ఎఐ వేదిక గ్రోక్ ద్వారా ప్రముఖులు అశ్లీల వీడి యోలు చేసి అపఖ్యాతిపాలు చేయ డం. ఇదే ఎలైన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంల అజెండా. ప్రముఖులు ఎప్పుడు తన దుష్ప్రచారానికి దొరుకు తారా అని ఎదురుచూస్తున్న మనక్కు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు అవకాశంగా దొరికాయి. అయితే ఆయన తన ఉద్దేశ్యం గురించి వివరణ కూడా ఇచ్చారు. ఎక్స్ వేదికగా అభిజీత్ దీప్కే అకౌంట్ ఓపెన్ చేయడం రెండు లక్షల ఫాలోవర్స్ రావడం రాత్రికి రాత్రి జరిగిపోయింది. మొదట ఎక్స్లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజీత్ దీప్కే అకౌంట్ ఓపెన్ చేయగానే ఫాలోయర్లు రెండు లక్షల మందికి పెరిగిపోయారు. అసాధారణం గా ఫాలోయర్లు పెరగడం, మరో వైపు, వివాదానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కేంద్ర బిందువు కావడంతో భారత దేశ హోం శాఖ అప్రమత్తమై ముందు జాగ్రత్తగా అకౌంట్ను తాత్కాలికంగా సీజ్ చేయించింది. తర్వాత దీని వివరాలు తెలుసుకుని అకౌంట్ను కొనసాగించడానికి అనుమతించారు. Read Also : Modi and Meloni:మనం ఇన్స్టాలో చాలా ఫేమస్..ఫ్రాన్స్ వేదికగా మోదీ-మెలోనీ క్రేజీ మీమ్స్! కాక్రోచ్ జనతా పార్టీ సీజ్ కావడంతో కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో ఎక్స్ లోనే మరో అకౌంట్ను అభిజీత్ ప్రారం భించాడు. మస్క్ ఎక్స్ వ్యవహార శైలిపై ఇప్పటికే దేశంలో అనేక ఫిర్యాదులున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే పోస్టులను తొలగించాలని సహాయోగ్ సెన్సార్ విభాగం కోరినా మస్క్ ఎక్స్ ఖాతరు చేయలేదు. దీనితో మస్క్ ఎక్స్కు హోం శాఖ ఈ ఏడాది