
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Meenakshi Natarajan on MP nomination rejected row: తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెట్రో పనులపై నిధులు వచ్చేలా చూడాలని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్ మెంట్ ఇచ్చేలా చూడాలని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అంతకు ముందు మేడిగడ్డ ప్రాజెక్ట్ వివాదంలో మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ అపాయింట్ ఇప్పించాలని కోరారు. ఈ క్రమంలో బీజేపీని టార్గెట్ గా చేసుకుని ఏకీపారేస్తున్నారు. బీజేపీ సైతం అదే విధంగా కౌంటర్ లు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మధ్య ప్రదేశ్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారం రాజుకుంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలే మీనాక్షీ నటరాజన్ పై ఉన్న కేసు గురించి బీజేపీకి ఉప్పందించారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ సైతం దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా.. మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రదేశ్ నుంచి రాజ్య సభ స్థానంకు తన నామినేషన్ తిరస్కరణ వెనుకాల తెలంగాణ కాంగ్రెస్ హస్తం ఉందనడంలో నిజంలేదని తెల్చి చెప్పారు. ఇదంతా డైవర్షన్ రాజకీయాలు అంటూ కొట్టి పారేశారు. అంతే కాకుండా తనకు రాజ్య సభ స్థానం కోసం తెలంగాణ నుంచి ఎంపీలు రాజీనామాకు సిద్దమైపోయారని వస్తున్న వార్తలపై కూడా రియాక్ట్