
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. AP Weather Alert:దక్షిణ కోస్తాకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఇక కోస్తా నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈశాన్య తూర్పు మధ్య బంగాళ ఖాతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది. ఏపీ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల విస్తరణ.. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య తూర్పు మధ్య బంగాళ ఖాతం మీదగా కూడా ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ అతి భారీ వరసాలు కురిసేందుకు అవకాశం ఉందని ముఖ్యంగా దక్షిణా కోస్తా ప్రాంతానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. నైరుతి వృత్తి పవనాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే కాస్త తగ్గుముఖంగానే ఉన్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం.. బంగళా ఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ