
ప్రపంచ రాజకీయాల్లో ఆర్ఐసీ.. అంటే రష్యా, భారత్, చైనాల మధ్య సంబంధాలు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా సాగుతుంటాయి. ఈ మూడు దేశాలని సిసలైన స్నేహబంధం కాదని, పరస్పర అవసరాల కోసం పరిమిత నమ్మకంతో కనిపించే కలయికని విశ్లేకులు చెపుతారు. పాకిస్థాన్తో అంటకాగే చైనా ఇండియాని ప్రత్యర్థిగా కాక భాగస్వామిగా చూస్తామని చెప్పడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్, చైనా విషయాల్లో మాస్కో జోక్యం చేసుకోబోదని వెల్లడించడం .. తాత్కాలిక ప్రయోజనాల కోసం చేసే ప్రకటనలే తప్ప దేశాల మధ్య గొప్ప సయోధ్య కుదరడం కాదంటారు పరిశీలికులు. రష్యా, భారత్, చైనాల ప్రాధాన్యం ప్రపంచంలో గత కొలంగా మరింత పెరుగుతోంది. ప్రపంచంలో పశ్చిమ దేశాల ప్రభావం, శిక్షణాత్మక ఆంక్షలు, సరఫరా ఒప్పందాలు, ప్రాంతీయ యుద్ధాల అనిశ్చితితో పెద్ద యూరేషియన్ శక్తులు తమ స్థానం ఎక్కడా అని లెక్కలు వేసుకుంటున్నాయి. ఆ క్రమంలో ఆర్ఐసీ కేవలం అమెరికా వ్యతిరేక పక్షంగా కాకుండా.. వాస్తవానికి, విభేదాల మధ్య సంప్రదింపుల వేదికగా ఉపయోగపడే అవకాశంగా అవతరిస్తోంది. అమెరికా, క్వాడ్, బ్రిక్స్, ఎసీఓ, రష్యా, చైనాలతో ఒకేసారి సంబంధాలు నెరపాల్సిన పరిస్థితుల్లో భారత్కు ఆర్ఐసీ వేదిక ప్రాధానమవుతోంది. ఇక్కడే భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి పరీక్షలు తప్పడం లేదు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్, భారత్, చైనా పరస్పర సంబంధాలను ప్రత్యర్థులుగా కాక భాగస్వాములుగా చూడాలనీ.. ఒకరి అభివృద్ధి మరొకరికి అవకాశం కావాలని చెప్పారు. ఇదే సందర్భంగా బీజింగ్ రెండు దేశాల సరిహద్దు పరిస్థితి స్థిరంగా ఉందనీ, సమాచార మార్గాలు సాఫీగా పనిచేస్తున్నాయని శాంతి వచనాలు చెప్పింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం భారత్, చైనా సమస్యలను వాళ్లే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, మాస్కో జోక్యం చేసుకోబోదని చెప్పారు. అంటే మధ్యవర్తి పాత్ర పోషించకుండా.. భారత్, చైనాల ఉద్రికత్తకు దూరంగా రెండు దేశాలతో సంబంధాలు కొనసాగించడానికి అనుసరిస్తున్న దౌత్య వ్యూహమే అని స్పష్టమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్