
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KTR vs Revanth Reddy: మహబూబ్నగర్ ప్రజలు కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి ద్రోహం చేస్తున్నారని.. కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో క్షేత్ర స్థాయి పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రస్తుతం కొనసాగిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. అనంతరం కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మహబూబ్నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి తరిమికొడతారు 'పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల