
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Apple Form In Telugu State: మన దేశంలో ఆపిల్ సాగు అంటే ముందుగా గుర్తొచ్చొది హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా ఆపిల్. అటు జమ్మూ కశ్మీర్లోని కశ్మీర్ ఆపిల్. ఇక ఆపిల్ సాగుకు ఎక్కువగా చల్లటి వాతావరణం ఉండాలి. అలాంటి ప్రదేశాల్లోనే ఆపిల్ పంట పండుతుంది. ఈ మధ్యకాలంలో మారిన టెక్నాలజీ ఆధారంగా అరుకు, ఆదిలాబాద్లో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రైతులు ఆపిల్ సాగు చేసినా.. దీర్ఘకాలంలో వర్కౌట్ కాలేదు. తాజాగా అనంతపురం ఎర్రటి ఎండల్లో రసభరితమైన ఆపిల్స్ పండించి చరిత్ర సృష్టించారు ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రైతు. సాధారణంగా ఆపిల్ చెట్లు మన వాతావరణంలో పెరగలేవు. అంతేకాదు ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు సహకరించవు. అయినా.. అనంతపురం జిల్లాలోని కోటంక అనే చిన్న గ్రామంలో 46 ఏళ్ల రైతు ఎన్.వి. రమణ రెడ్డి అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి ఔరా అనిపించారు. అంతేకాదు తన పొలాల్లో ఎర్రని, రసభరితమైన ఆపిల్స్ పంటను సమృద్ధిగా పండించి ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా ఆపిల్ సాగు విజయవంతం కావడం ఇదే మొదటి సారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా ద్వీపకల్ప భారతదేశంలోనే ఇది తొలి ప్రయత్నం అంటున్నారు. ఈ ఆపిల్ టేస్ట్.. సిమ్లా, జమ్మూ కశ్మీర్ ఆపిల్ టేస్ట్కు ఏమాత్రం తీసిపోకుండా ఉందని కితాబు ఇస్తున్నారు. 2020లో, రమణ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ నుండి మూడు రకాల ఆపిల్ మొక్కలను