
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Good News For Rural Women: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే.. జాతీయ పశుసంపద మిషన్ కింద గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం మేకలు, గొర్రెలు, పందుల పెంపకంపై 90శాతం వరకు సబ్సిడీని అందిస్తుంది. దీనికి మహిళలు తమ సొంత జేబు నుండి కేవలం 10శాతం మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకం నుండి ఎలా ప్రయోజనం పొందాలో.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. సబ్సిడీ నిష్పత్తి: మొత్తం ఖర్చులో 90శాతం ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. కాగా లబ్ధిదారులు ఆ మొత్తంలో కేవలం 10శాత్ం మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మేకలు, గొర్రెల పెంపకం: ఈ పథకం కింద, 10 నుండి 20 ఆడ మేకలు, 1 మగ మేక లేదా గొర్రెతో కూడిన ఒక యూనిట్ను ఏర్పాటు చేయడానికి మహిళలు, స్వయం సహాయక బృందాలు ఆర్థిక సహాయం పొందుతాయి. ఉదాహరణకు.. ఒక యూనిట్ (అంటే 10 ఆడ మేకలు 1 మగ మేక) మొత్తం ఖర్చు రూ. 66,000 అయితే.. మీరు సుమారుగా రూ. 59,400 సబ్సిడీని పొందవచ్చు. మీ పెట్టుబడి రూ. 6,600కు పరిమితం అవుతుంది. పందుల పెంపకం: ఈ పథకం కింద, ఒక మగ పంది, మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆడ పందులు ఉండే యూనిట్ను ఏర్పాటు చేయడానికి భారీ మొత్తంలో సబ్సిడీ అందిస్తుంది. . మేకలు, గొర్రెలు, పందుల పెంపకానికి ప్రభుత్వం 90శాతం సబ్సిడీని అందిస్తుంది. ఉత్తర ప్రదేశ్
