
గొడ్డలిపార్టీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది-సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి సర్ ప్రక్రియ కారణంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమం జులై 10కి వాయిదా అవనిగడ్డ కార్యకర్తల సమావేశంలో టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మోపిదేవి (అవనిగడ్డ): గొడ్డలి పార్టీ నేతలు, గత ప్రభుత్వంలో బూతు మంత్రులు కృష్ణా జిల్లా పరువు ఎలా తీశారో, ప్రస్తుతం విషప్రచారాలు ఎలా చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేడర్పై ఉందని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కార్యకర్తలకు విజ్జప్తిచేశారు. మోపిదేవిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ... మహనీయులు జన్మించిన ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో బూతుల మంత్రి ఉండేవారు, ఒకడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాడు. మరొకడు భువనేశ్వరమ్మను అవమానించేవాడు. నేను ఆనాడే చెప్పా, వారి పేర్లు ఎర్రబుక్కులో రాస్తున్నా అని. వారి విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు, రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉమ్మడి కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జన్మించిన నేల ఇది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అవనిగడ్డలో ఆరుసార్లు టిడిపి, ఒకసారి కూటమి విజయం సాధించాయి. తెలుగుదేశం కార్యకర్తల రెక్కల కష్టంతోనే ఇది సాధ్యమైంది. పార్టీకోసం అహర్నిశలు కష్టపడి పనిచేయాలి కడపలో గతఏడాది మహానాడులో ఐడియాలజీలో మార్పుకోసం ఆరుశాసనాలు తీసుకున్నాం. అందులో తొలి శాసనం కార్యకర్తే అధినేత. మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజున జాతీయ అధ్యక్షుడి పక్కన టిడిపి సాధారణ కార్యకర్తలు కూర్చున్నారు. మార్పు మనవద్ద నుంచే మొదలు కావాలి. మనం ఎవరం శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. వ్యవస్థను బలోపేతం చేసేందుకు అందరం అహర్నిశలు కష్టపడాలి. తోటచంద్రయ్యను గత ప్రభుత్వంలో ప్రత్యర్థులు వారి నాయకుడికి జైకొట్టమని మెడపై కత్తిపెడితే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. గొడ్డలిపార్టీ అడ్డంకులు సృష్టించినా చట్టాన్ని సవరించాం. తోట చంద్రయ్య కుమారుడికి
