అమెరికా తన విదేశాంగ విధానంలో కీలక మార్పులు చేస్తూ.. ఇరాన్ చమురుపై 60 రోజుల పాటు ఆంక్షలకు సడలింపు ఇచ్చింది. ఆగస్టు 21 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇరాన్తో విస్తృత శాంతి ఒప్పందం కోసం జరుగుతోన్న చర్చల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్కు ఈ పరిణామం వల్ల భారీ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల తక్షణమే ఇరాన్ ట్యాంకర్లు భారత్కు రాకపోవచ్చు కానీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్థిరంగా ఉన్న తరుణంలో భారత్కు మరో చమురు వనరు అందుబాటులోకి వచ్చే అవకాశం కల్పించింది. గత కొన్నేళ్లలో న్యూఢిల్లీకి ఇటువంటి అవకాశం రావడం ఇదే మొదటిసారి.అమెరికా ప్రకటన ఏంటి?ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్కు సంబంధించిన లావాదేవీలను అనుమతిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ ఒక తాత్కాలిక సాధారణ లైసెన్సును జారీ చేసింది. ఈ మినహాయింపు షిప్పింగ్, బీమా, బ్యాంకింగ్ వంటి అనుబంధ సేవలకు కూడా వర్తిస్తుంది. ఇది ఆగస్టు 21 వరకు చెల్లుబాటులో ఉంటుంది.అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలకు ఇరాన్ అనుమతించడం, విస్తృత దౌత్య చర్చలలో పాల్గొనడంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను శాశ్వతంగా ఎత్తివేయడంగా కాకుండా, విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా పరిగణిస్తున్నారు. ఈ నిర్ణయం చమురు మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపింది. అదనపు సరఫరాలు మార్కెట్లోకి వస్తాయని వ్యాపారులు అంచనా వేయడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి.భారత్పై ప్రభావం ఎంత?భారత్ వినియోగించే ఇంధనంలో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే సేకరిస్తోంది. అందుకే అంతర్జాతీయ చమురు ధరలలో వచ్చే మార్పు న్యూఢిల్లీని ప్రభావితం చేస్తాయి. క్రూడాయిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ భారత దిగుమతి బిల్లులను పెంచి, ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తోంది. చివరకు వినియోగదారులపై భారం పడుతుంది. అయితే, గత నాలుగేళ్లుగా భారత ఇంధన దిగుమతుల


అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్పై దశాబ్దాలుగా విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చల అనంతరం, ఇరాన్ తన

అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ చమురు పరిశ్రమకు ఊహించని ఊరటనిస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై విధించిన కఠినమైన ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తూ 60 రోజుల మినహాయింపు ప్రకటించింది. ఆగస్టు 21 వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం ప్రకారం ఇరాన్ నుంచి ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, అమ్మకం, రవాణా, దిగుమతులకు అనుమతి లభించింది. టెహరాన్తో విస్తృత శాంతి ఒప్పందం, అంతర్జాతీయ అణు తనిఖీలను తిరిగి ప్రారంభించే లక్ష్యంతో జరుగుతున్న చర్చల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పెంచే చర్యగా భావిస్తున్నారు.భారత్కు ఈ పరిణామం ఎందుకు కీలకం?ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్కు ఈ పరిణామం వ్యూహాత్మకంగా ఎంతో మేలు చేయనుంది. తన మొత్తం చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్, అంతర్జాతీయ ధరల ఒడిదొడుకులకు తీవ్రంగా ప్రభావితమవుతుంది. ముడి చమురు ధరల్లో ఏ చిన్న పెరుగుదలైనా దేశ దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలపై పెను ప్రభావాన్ని చూపుతుంది.గత నాలుగేళ్లలో భారత్ చమురు దిగుమతుల సరళిలో భారీ మార్పులు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రాయితీపై లభించే రష్యన్ ముడి చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ప్రస్తుతం మన దేశ మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 30-40 శాతంగా ఉంది. అదే సమయంలో సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపై కూడా భారత్ అధికంగా ఆధారపడి ఉంది

Iran-America War: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలన్నింటికీ ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, దీని ప్రభావం భారతదేశంపై అత్యంత సానుకూలంగా ఉండబోతోంది. గడిచిన కొద్ది

అమెరికా, ఇరాన్ మధ్య నాలుగు నెలలుగా తీవ్ర రూపం దాల్చిన దౌత్య, సైనికపరమైన ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ పరస్పర అవగాహన