
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మచిత్ర కళాకారుడు గట్టెం వెంకటేశ్‌ వినాయక చవితిని పురస్కరించుకుని పెన్సిల్‌పై స్వామివారి రూపాన్ని అద్భుతంగా మలిచారు. రెండు గంటల పాటు శ్రమించి 12 మిల్లీమీటర్ల ఎత్తు, 6 మిల్లీమీటర్ల వెడల్పుతో గణపతి రూపాన్ని చెక్కారు. గతంలో వెంకటేశ్‌ పలు సూక్ష్మ కళారూపాలను తయారు చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగోలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






