
టాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ల ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఆపై వెండితెరపై కథానాయికగా మంచి సక్సెస్ సాధించింది ఈ తెలుగు అమ్మాయి. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన ఆమె అల వైకుంఠపురములో వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె, ‘బేబీ’ సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి చిత్రంతోనే ఓవర్నైట్ స్టార్గా మారిపోయారు. అయితే ఈ సినిమా ఇచ్చిన అపారమైన విజయం ఒకవైపు ఉంటే, ఆ చిత్రంలో తాను పోషించిన పాత్ర కారణంగా ఆమె ఎదుర్కొన్న తీవ్రమైన ట్రోలింగ్ మరొకవైపు ఆమెను తీవ్రంగా కలిచివేసిందట. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైష్ణవి ఈ విషయంపై స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన ఎపిక్ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది.






