
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా కనిపించే అలంకరణకు భిన్నంగా.. ఈ గణనాథుడికి పోలీస్ టోపీ, హెల్మెట్ అలంకరించడం విశేషంగా మారింది. భక్తితో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.





