
cm chandrababu Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఏపీ ప్రభుత్వం తరఫున ఆయన శ్రీవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు ముందుగా శ్రీవారి ఆలయానికి వెళ్లారు. అనంతరం ఆనంద నిలయంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.





