
తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగ్పూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు బుధవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ తన బృందంతో భేటీ అయ్యారు.





