
పోలీసుల చిత్రహింసల వల్లే గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి మృతి చెందాడని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మృతుడి కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఆయన రాజధాని అమరావతిలోని తుళ్లూరులో మాట్లాడారు.



