
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పచ్చదనం అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ ద్వారా విత్తన బంతులు(సీడ్ బాల్స్)ను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో అటవీశాఖ అధికారులు లక్ష్యాన్ని మించి విత్తన బంతులు వెదజల్లారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం 7 లక్షలు కాగా, 8.2 లక్షలకు పైగా సీడ్ బాల్స్ వెదజల్లారు.





