
బాగా చదువుకుని కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న కొడుకు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. తిరుపతి జిల్లా డక్కిలి మండలానికి చెందిన హైమావతికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడిని బాగా చదివించాలని 16 ఏళ్ల కిందట నెల్లూరుకు వచ్చారు. హైమావతి భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుమారుడు వెంకటాద్రి ఇంటర్ చదువుతున్నాడు. ఏడాది క్రితం వెంకటాద్రికి కామెర్లు సోకాయి. పేదరికంతో వైద్య పరీక్షలతోపాటు, సరైన చికిత్స చేయించలేక వ్యాధి తీవ్రత తెలియరాలేదు. ఇటీవల కడుపు ఉబ్బడంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వారి సూచనతో చెన్నైకి తీసుకెళ్లగా వైద్యులు కాలేయం మార్పిడి చేయాలని కనీసం రూ.60 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. లివర్ ఇవ్వడానికి అతని సోదరి ముందుకు వచ్చినా.. వైద్యానికి అవసరమైన డబ్బు ఆ కుటుంబం దగ్గర లేదు. దీంతో తన కుమారుడిని బతికించాలని హైమావతి వేడుకుంటున్నారు. ఈ వార్త చదివారా: 34 శాతం రిజర్వేషన్లు.. బీసీల జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయం: చంద్రబాబు





