
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి మూడేళ్లు కావ స్తున్నా చేయూత పింఛన్ల పెంపుపై ఊసేత్తడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2016 పెన్షన్ ఇవ్వగా, తాము అధికారంలోకి వస్తే చేయూత పెన్షన్లు రెండింతలు చేస్తామని, కుటుంబంలో ఇద్దరికి సమానంగా పింఛన్ ఇస్తామని 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కాని ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్న హామీ అమలు కావడం లేదని పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





