
విశాఖ మన్యంలో అతిథి పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండగా సంప్రదాయ అటవీ ఉత్పత్తులను పట్టించుకోవడం లేదు. దీంతో అవి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అతిథి పంటలుగా పేరొందిన కాఫీ, మిరియాల విస్తీర్ణం పెంపునకు ఎన్నో రాయితీలను ప్రభుత్వం ఇస్తోంది. అయితే సంప్రదాయ ఉత్పత్తులైన ఉసిరి, నరమామిడి, కోవెల జిగురు, కొండ చీపుళ్లు, తేనె, అడ్డాకులు వంటి తదితర వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా భవిష్యత్తు తరాలకు వీటి గురించి తెలియని పరిస్థితి ఏర్పడనుంది.





