
జిల్లాలో సోమవారం నుంచి వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణనాథుడిని కొలువుదీర్చేందుకు భక్తులు మండపాలను ముస్తాబు చేయగా, విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. పలు చోట్ల మట్టి వినాయక విగ్రహాలు, కర్ర వినాయకులను కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు చేయగా ఆయా ప్రాంతాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.





