
రాష్ట్రానికి కేంద్ర రక్షణ రంగానికి చెందిన సంస్థ గోవా షిప్యార్డు లిమిటెడ్ (జీఎస్ఎల్) రానుంది. మచిలీపట్నంలో రూ.8000 కోట్లతో షిప్యార్డ్ వర్క్షాప్ బిల్డింగ్ యూనిట్ స్థాపించనుంది. ఇప్పటికే ఈ సంస్థ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ఆమోదం తెలిపింది.





