
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. విద్యుద్దీప కాంతుల్లో ఆలయం వెలుగులీనుతోంది. స్వాగత ఆర్చిలు, అలంకరణలతో కాణిపాకానికి బ్రహ్మోత్సవ శోభ వచ్చింది. ఆలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. సుమారు లక్ష మంది భక్తులు స్వామి దర్శనానికి రానున్నట్లు అధికారుల అంచనా. అందుకు తగ్గట్టు ప్రత్యేక క్యూలైన్లు, ఏర్పాట్లు చేశారు.





