
AP CM Chandrababu Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్, కోడలు బ్రాహ్మిణిలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





