మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాల గనిలో భారీ డైమండ్ దొరికింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఎండీసీకి చెందిన సిబ్బంది ఏకంగా 27.29 క్యారెట్ల జెమ్ క్వాలిటీ వజ్రాన్ని వెలికితీశారు. పన్నా గనిలో కార్యకలాపాలు మొదలైన తర్వాత లభించిన వజ్రాల్లో ఇది రెండో అతిపెద్దది కావడం విశేషం. ఈ డైమండ్కు వేలంలో భారీ ధర వచ్చే అవకాశం ఉంది. దీని ఆకారం, రంగు, స్వచ్ఛత, బరువును పరిశీలించిన తర్వాత ప్రారంభ వేలం ధరను సుమారు రూ.కోటిగా నిర్ణయించే అవకాశం ఉందని ఎన్ఎండీసీ తెలిపింది. వేలం పూర్తయ్యే సమయానికి ఈ వజ్రం రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు ధర పలికే ఛాన్స్ ఉందని పేర్కొంది.