
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఉద్యోగులను పునర్వర్గీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులు, అధికారులు జిల్లా, జోనల్, రాష్ట్ర.. ఇలా మూడు క్యాడర్లలో పనిచేస్తున్నారు.





