
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle)జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
జూలై మూడో వారంలో ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదంపైనే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. మంత్రివర్గంలో మార్పులు చేయడం కంటే రాబోయే సభలో ప్రజా ప్రాధాన్యమున్న చట్టాలను తీసుకురావడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తోంది.మోడీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఫిక్స్..! రాష్ట్రపతికి అమిత్ షా లిస్ట్ ?కేబినెట్ ప్రక్షాళన వాయిదా (Cabinet Reshuffle)ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడితే, పదవులు దక్కని నేతల్లో అసంతృప్తి తలెత్తే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్‌లో ప్రభుత్వానికి సొంతంగా మూడింట రెండు వంతుల మెజారిటీ లేకపోవడంతో, కీలక బిల్లుల ఆమోద సమయంలో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి బిల్లుల సమయంలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టింది.త్వరలో ఏపీ కేబినెట్ ప్రక్షాళన-హోంమంత్రిగా పవన్-రఘురామ షాకింగ్..!కేబినెట్ విస్తరణ ఎప్పుడు ?ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ కూడా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడటానికి ఒక ముఖ్య కారణం. జూలై మొదటి వారంలో జపాన్ ప్రధాని పర్యటన, ఆ తర్వాత రాజస్థాన్ సందర్శనతో పాటు జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో ప్రధాని పర్యటించనున్నారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి కొత్త మంత్రులకు తమ శాఖలపై అవగాహన పెంచుకోవడానికి తగిన సమయం కూడా లభించదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గతంలో వర్షాకాల సమావేశాలకు ముందే భారీ మార్పులు చేసిన దాఖలాలు ఉన్నాయి. 2021 జూలైలో పార్లమెంట్ సమావేశాలకు కొన్ని రోజుల ముందే అప్పటి ప్రభుత్వం 12 మంది మంత్రులను తొలగించి, 36 మంది కొత్త మంత్రులను కేబినెట్ లోకి తీసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం..! జార్ఖండ్ నుంచి గెలిచిన వైసీపీ మాజీ ఎంపీ..! విస్తరణలో ప్రాధాన్యతలివే..త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో మంత్రుల పనితీరుతో పాటు వయస్సు కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 70 ఏళ్లు పైబడిన వారు ఎనిమిది మంది ఉండటంతో యువతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడంపై దృష్టి సారించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ వంటి నిపుణులను సాంకేతిక అంశాల్లోకి తీసుకునే యోచన కూడా ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఏడు రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఓబీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయనున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రా వంటి వారు పార్టీ పదవుల్లో ఉండటంతో ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన సవాళ్లు విసురుతోంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయనున్నారు.