
తాము భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నామో కొందరు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. మరికొందరు తమకు అండగా నిలుస్తున్న వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకొందరు తమ విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పులపై స్పష్టమైన సూచనలు చేశారు. వీటన్నింటికీ వేదికైంది ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం. పది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక, విద్యార్థుల చురుకైన భాగస్వామ్యంతో ఎంతో ఉత్తేజభరితంగా సాగింది.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాల్ బోర్డులు. కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేశ్, వేదిక వద్దకు వెళ్లడానికి ముందు ఈ వాల్ బోర్డులను ఆసక్తిగా పరిశీలించారు. ‘డ్రీమ్ వాల్’, ‘గ్రాటిట్యూడ్ వాల్’, ‘సజెషన్ వాల్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ గోడలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకున్నారు. ప్రతి విద్యార్థి అభిప్రాయాన్ని లోకేశ్ ఓపికగా చదివి, వారి ఆలోచనా విధానాన్ని తెలుసుకున్నారు.ఉన్నత లక్ష్యాలతో స్ఫూర్తి నింపిన విద్యార్థులు‘డ్రీమ్ వాల్’పై విద్యార్థులు తమ భవిష్యత్ ఆశయాలను ఆవిష్కరించారు. మన్యం జిల్లా ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎన్. మౌనిక, తాను డాక్టర్ కావాలనుకుంటున్నట్లు తెలిపారు. "వైద్యురాలినై సమాజానికి సేవ చేస్తాను. పేద ప్రజల కోసం ఆసుపత్రులు నిర్మించి, మన దేశం ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండేందుకు కృషి చేస్తాను" అని తన మహోన్నత లక్ష్యాన్ని వివరించారు. కాకినాడ జిల్లా సంపర