
హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయబోమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మూసీ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్లు కోల్పోయేవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. భూములు కోల్పోయే వారికి పరిహారం, పునరావాసంలో రాజీ ఉండదని పొంగులేటి స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.