
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బొడుప్పల్లోని దేవేందర్ నగర్లో నిన్న(ఆదివారం) ఓ కుటుంబంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గృహప్రవేశం చేసిన రోజే బాధిత కుటుంబంపై దాడి సంచలనం రేపుతోంది.
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ 12 మందిని అరెస్టు చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: బొడుప్పల్లోని దేవేందర్ నగర్లో నిన్న(ఆదివారం) ఓ కుటుంబంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గృహప్రవేశం చేసిన రోజే బాధిత కుటుంబంపై దాడి సంచలనం రేపుతోంది. అయితే, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ 12 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శ్యామ్రావు అనే వ్యక్తి దేవేందర్ నగర్లో ఇటీవల ఓ స్థలాన్ని తీసుకుని ఇంటిని నిర్మించాడు. ఆదివారం తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించాడు. బంధువులను పిలుచుకుని శ్యామ్రావు కుటుంబం వేడుకను ఘనంగా చేసుకుంది.
అయితే, కాసేపటికే ఓ మూక వారి సంతోషాన్ని చెల్లాచెదురు చేసింది. సుమారు 50 మంది గుంపుగా వచ్చి శ్యామ్ రావు ఇంటిపై దాడికి దిగారు. 'ఇది మా ఇలాకా.. ఇక్కడ ఇల్లు ఎలా కట్టావు?' అంటూ బాధిత కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఇంట్లోకి చొరబడి మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇంటి అద్దాలు, సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన బంధువులు, పక్కింటి వారిపైనా దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 12 మంది నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. బాధిత కుటుంబసభ్యులను విచక్షణారహితంగా కొట్టడాన్ని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
వర్షం ఎఫెక్ట్.. మధిర రైతు ఆశీర్వాద సభ రద్దు.. హైదరాబాద్కు షిఫ్ట్
జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్