
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
IND W Vs AUS W T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రస్థానం ముగిసింది. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో మహిళల టీ20 ప్రపంచకప్లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. అటు బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ లో భారీగా వైఫల్యం కారణంగా భారత్ జట్టు నిష్క్రమించగా.. గ్రూప్ 'ఏ' నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్కు చేరుకున్నాయి. అలాగే గ్రూప్ 'బీ' నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి.
భారత్ భారీ స్కోరు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించింది. ముఖ్యంగా చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది. అంతకు ముందు బ్యాటింగ్ కు వచ్చిన స్మృతి మంధాన (38 పరుగులు), షఫాలీ వర్మ (34 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (34 పరుగులు) తమదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత మహిళా బ్యాటర్లు ఆకట్టుకున్న వేళ ఆస్ట్రేలియా ముందు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
మ్యాచ్ మార్చేసిన గార్డ్నర్, పెర్రీ.. 172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టును ఆరంభంలోనే భారత బౌలర్లు కట్టడి చేశారు. ఒకానొక దశలో మ్యాచ్ టీమ్ఇండియా చేతిలే ఉన్నట్లే అనిపించింది. కానీ, యాష్ గార్డ్నెర్ క్రీజ్లోకి వచ్చాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. యాష్ గార్డ్నర్ కేవలం 29 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు (నాటౌట్) చేసి మ్యాచ్ను ఆసీస్ వైపు తిప్పేసింది. అలాగే ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ వెటరన్ ప్లేయర్ ఎలిసా పెర్రీ 38 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు (నాటౌట్) చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో విజయంలో కీలక పాత్ర పోషించింది.
చేతులెత్తేసిన బౌలర్లు.. మ్యాచ్ కీలక సమయంలో టీమ్ఇండియా బౌలర్లు ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. నో బాల్స్ వేయడం సహా, వరుస మిస్ ఫీల్డ్స్ ఆస్ట్రేలియా గెలుపును సునాయాసం చేశాయి. ఇన్నింగ్స్లో మరో 6 బంతులు మిగిలుండగానే.. 19వ ఓవర్ నాటికి 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో భారత మహిళల ప్రపంచకప్ కల మరోసారి చెదిరిపోయింది. ఈ గెలుపుతో సెమీఫైనల్కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టు.. ఆ మ్యాచ్లో సౌతాఫ్రికాతో తలపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.