
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: గత రెండు రోజులుగా భారీగా పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు మళ్లీ కాస్త తగ్గాయి. సోమవారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,43,940గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1, 31, 940గా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 2,44,900గా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా విలువైన లోహాల ధరలు నిరంతరం పడిపోవడం.. గత ట్రేడింగ్ లో డాలర్ బలపడటం వంటి వాటి ప్రభావం ఇప్పుడు దేశీయ మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడంతో దేశంలో వరుసగా మూడో ట్రేడింగ్ రోజు కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9శాతం స్వచ్ఛత కలిగిన 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,800 తగ్గి రూ. 1,43,940కి చేరింది. గత మూడు నెలల్లో ఇదే అత్యల్ప స్థాయి. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో, బంగారం 10 గ్రాములకు రూ. 1,48,100 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లో కూడా బంగారంపై ఒత్తిడి కొనసాగింది. స్పాట్ గోల్డ్, నవంబర్ 2025 తర్వాత తొలిసారిగా ఔన్సుకు $4,000 కీలక స్థాయి కంటే దిగువకు పడిపోయింది. దీని ధర రూ. 21.15 లేదా 0.53 శాతం తగ్గి ఔన్సుకు $3,978.06కి చేరింది.
డాలర్ బలం, అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయనే భయం బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు ప్రస్తుతం డాలర్ను సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న క్షీణత ప్రభావం దేశీయ మార్కెట్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే అమెరికా ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ వైఖరి బంగారం ధరల భవిష్యత్ దిశను నిర్ణయిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, పెట్టుబడిదారులు ఇప్పుడు పూర్తిగా అమెరికా నుండి వచ్చే సంకేతాలపై దృష్టి సారించారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.