
గుండెపోటుతో మరణించిన ప్రముఖ దర్శకుడు కె. భాగ్యరాజ్ (73)అంత్యక్రియలు ఆదివారం ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. గుండెపోటుతో మరణించిన ప్రముఖ దర్శకుడు కె.
భాగ్యరాజ్ (73) (K Bhagyaraj) అంత్యక్రియలు ఆదివారం ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. నుంగంబాక్కంలోని ఆయన స్వగృహం నుంచి బిసెంట్ నగర్ లోని విద్యుత్ శ్మశానవాటిక వరకు అంత్యక్రియల ఊరేగింపు 24 మంది పోలీసుల బృందం కవాతుతో సాగింది ఊరేగింపులో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, దర్శకులు, కథా రచయితలు, భాగ్యరాజ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
73 యేళ్ళ భాగ్యరాజ్.. శనివారం. ఉదయం గుండెపోటుకు గురి కావడంతో నగరంలోని అపోలో అస్పత్రికి తరలించగా, అక్కడ మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణవార్తతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. భాగ్యరాజ్ ఇకలేరని తెలియగానే ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అంత్యక్రియ లను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. దీంతో ఆదివారం అంత్యక్రియలు ప్రభుత్వ బంధనాలతో పూర్తి చేశారు. స్థానిక బిసెంట్ నగర్లోని విద్యుత్ శ్మశానవాటికలో పోలీసులు గాల్లోకి 72 బుల్లెట్లను పేల్చి ప్రభుత్వం లాంచనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు ఆనంద్, రాజ్ మోహన్ పాల్గొన్నారు. భాగ్యరాజ్ ఏకైక కుమా రడు శాంతను భాగ్యరాజ్ హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించగా, ఆ తర్వాత భాగ్యరాజ్ పార్టీ పదేహాన్ని విద్యుత్ దహనవాటికలో దహనం చేశారు.
భాగ్యరాజ్ అంత్యక్రియలను కవర్ చేస్తున్న మీడియాపై ప్రముఖ నటి సుహాసిని మండిపడ్డారు. భాగ్యరాజ్ పార్థివదేహాన్ని ఊరేగింపు కోసం వాహనంలో ఎక్కించిన తర్వాత కొందదు కెమెరామెన్లు పార్థివదే హాన్ని వీడియో తీసేందుకు పోటీపడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సుహాసిని వారిని వెనక్కి నెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, శనివారం నివాళులర్పించేందుకు వచ్చిన నటి రాధిక శరత్ కుమార్ కూడా అబిమానుల రద్దీలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తమ అభిమాన దర్శకుడు భాగ్యరాజ్ పాడెను నటులు శరత్ కుమార్, పార్తిబన్ సహా మరికొందరు మోయడమే. కాకుండా, ఈ అంత్యక్రియలన్నీ సాఫీగా సాగేలా దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. పార్థిపదేహాన్ని ఇంటి నుంచి ఊరేగింపు వాహనంలోకి ఎక్కించే సమయంలో శరత్ కుమార్, పార్తిబన్ మరికొందరు నటులు పాడే మోశారు.
భాగ్యరాజ్ పార్థివదేహానికి నివాళులర్పిస్తుండగా, ఆయన పెంపుడు శునకం చేసిన పని ప్రతి ఒక్కరి కంటకన్నీరు. తెప్పించింది. ఒక సమయంలో భాగ్యరాజ్ పార్థివదేహం ఉన్న శవపేటిక వద్దనే ఉండి, తన యజమాని ముఖాన్నే చూస్తూ ఉండిపోయింది. అంతేకాకుండా పార్థివదేహం ఉన్న శవపేటిక చుట్టూ పలుమార్లు తిరుగుతూ తన విశ్వాసాన్ని చాటుకుంది.