
Aamani : ఒకప్పటి హీరోయిన్ ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. ఆమని ప్రస్తుతం హ్యాపీ జర్నీ అనే సినిమాలో నటిస్తుంది. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, ఆమని, పాయల్ రాధాకృష్ణ, రవి శివతేజ, వంశీ..
ఇలా చాలా మంది ఆర్టిస్టులతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంతమంది కలిసి ప్యారిస్ వెళ్లి ఏం చేసారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా షూటింగ్ మొత్తం ప్యారిస్ లోనే జరిగింది. దాదాపు 22 రోజులు ఈ ఆర్టిస్టులు అంతా ప్యారిస్ లోనే ఉండి సినిమా షూట్ పూర్తి చేశారు. తాజాగా హ్యాపీ జర్నీ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నటి ఆమని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆమని మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ చూడలేదు. అక్కడ భోజనాలు అయితే సూపర్. అసలు నేను మాములుగా డైట్ లో ఉంటాను కానీ అక్కడ డైట్ లో లేను మొత్తం తినేసాను. డిన్నర్ లో ఒక పెద్ద ట్యాంక్ పెట్టేవారు. ట్యాంక్ నిండా వైన్ ఉంటుంది. అందరూ వెళ్లడం అది ఓపెన్ చేసి పట్టుకోవడం తాగడమే ఎవరికి వాళ్ళు. నాన్ వెజ్ అయితే చికెన్, మటన్, ప్రాన్స్, ర్యాబిట్.. చాలా వెరైటీలు పెట్టారు. నేనైతే అవి తినలేదు వెజిటేరియన్ కాబట్టి అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్.